Karumuri Nageswara Rao: ఆధార్ తో లింక్ తర్వాత దొంగ ఓట్లు బయటికి వస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొంగ ఓట్లను పుట్టించిందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని ఆయన ఆరోపించారు. ఆధార్ కార్డుతో లింక్ తర్వాత దొంగ ఓట్లు బయటికి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన కుటుంబ సభ్యులు మళ్ళీ నిన్న కలిసినట్లుగా ఉంది అని మంత్రి వ్యాఖ్యనించారు.
Read Also: Jharkhand: మనుషుల పైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి, 10 మందికి తీవ్ర గాయలు..
Also Read
దివంగత నేత ఎన్టీఆర్ మంచి నాయకుడు. చెల్లని నాణాన్ని నందమూరి తారక రామారావు పేరు మీద విడుదల చేశారు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ నాణెం ప్రజల్లో చలామణి అయ్యేలా ఉండాలి.. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని ఎందుకు పిలువలేదు అని ఆయన ప్రశ్నించారు. ఇక, తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న పలు దుకాణాలపై కేసులు నమోదు చేశామని మంత్రి అన్నారు. నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలపై టీడీపీ హయాంలో కేవలం 21 కోట్ల రూపాయల జరిమానా విదిస్తే.. వైసీపీ పాలనలో 40 కోట్ల రూపాయల ఫైన్ వేశామని కారుమూరి తెలిపారు. నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలపై 1162కు పైగా కేసులు నమోదు చేసినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు.
Read Also: BRS Party: సాయిచంద్ కుటుంబానికి అండగా బీఆర్ఎస్.. కుటుంబంలోని అందరికీ చెక్కులు..
2014, 2019 ఎన్నికల్లో టైమ్స్ నౌ చెప్పినట్లుగానే వైసీపీకి సీట్లు వచ్చాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. టైమ్స్ నౌ సర్వే ఈసారి మాకు 24 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకీ 165 సీట్లు ఖాయం అంటూ ఆయన జోస్యం చెప్పుకొచ్చారు. ఇక, ఇండియా టుడే సర్వే వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు.. సీఎం జగన్ కు వ్యతిరేక ఓటు లేదు.. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక ఎవరికైనా అందేదా అని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!