Minister Merugu Nagarjuna: టీడీపీ, జనసేన ఏకమైనా.. బీజేపీ కలిసినా.. అధికారంలోకి వచ్చేది మేమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Merugu Nagarjuna: తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఏకమైనా.. బీజేపీ వారితో కలిసినా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి మేరుగు నాగార్జున.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన దూకుడు గాళ్లు సీఎం రమేష్, సుజనా చౌదరి ఇచ్చిన స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదువుతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన విభజన హామీ చట్టం గురించి మాట్లాడలేదు, మేం మొదటినుంచి పోరాటం చేస్తున్న ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని మండిపడ్డారు.. ఇక, త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
Read Also: Cyclone Biparjoy: భీకర తుఫానులో కోస్ట్గార్డ్ సాహసం.. సముద్రం నుంచి 50 మంది రెస్క్యూ..
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే.. మరోసారి సీఎం జగన్ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి నాగార్జున.. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్న ఆయన.. వారాహి యాత్ర కాదది.. నారాహి యాత్ర అంటూ సెటైర్లు వేశారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి మేరుగు నాగార్జున. కాగా, వరుసగా ఏపీలో పర్యటించిన జేపీ నడ్డా, అమిత్షా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేసిన ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే.. దీంతో.. ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ నేతలుగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు వైసీపీ, బీజేపీ నేతలు.
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..