Cyclone Biparjoy: భీకర తుఫానులో కోస్ట్గార్డ్ సాహసం.. సముద్రం నుంచి 50 మంది రెస్క్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిని ‘బిపార్జాయ్’ తుఫాన్ విరుచుకుపడేందుకు సిద్ధం అవతోంది. ఈ నెల 15న గుజరాత్ తీరాన్ని తుఫాన్ తాకే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ముఖ్యంగా తుఫాన్ గుజరాత్ తీరంపై విరుచుకుపడనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. పలు జిల్లాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో చేపలవేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరించారు.
ఇదిలా ఉంటే ఓ వైపు తుఫాన్ ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ.. ఇండియన్ కోస్టుగార్డు 50 మందిని సురక్షితంగా తీరానికి చేర్చింది. సముద్రంలో ఆయిల్ రిగ్ లో పనిచేస్తున్న సిబ్బందని విజయవంతంగా రెస్క్యూ చేసింది. తుఫాన్ నేపథ్యంలో వీరిందరి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండటంతో కోస్టుగార్డు వీరోచితంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. గుజరాత్ లోని ద్వారక ఓఖా తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్న ఆయిల్ రిగ్ లో పనిచేస్తున్న వారిని తీరానికి తీసుకువచ్చింది.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
Read Also: Free Aadhaar Update: ఆధార్ ఫ్రీ అప్డేట్.. చివరి గడువు రేపే! తర్వాత డబ్బులు కట్టాల్సిందే
సోమవారం సాయంత్ర ప్రారంభమైన ఈ ఆపరేషన్ లో సోమవారం 26 మందిని, మంగళవారం 24 మంది సిబ్బందిని తరలించారు. 48 గంటల పాటు ఈ వీరోచిత రెస్క్యూ ఆపరేషన్ ను కోస్ట్ గార్డు నిర్వహించింది. రెండు బ్యాచుల్లో సిబ్బందిని ICG ALH ధ్రువ్ హెలికాప్టర్ల ద్వారా సముద్రంలోని జాక్ అప్ రిగ్ ‘కీ సింగపూర్’ నుంచి వీరందరిని కోస్ట్ గార్డు సురక్షితంగా తీరానికి చేర్చింది. అడ్వాన్సుడ్ లైట్ హెలికాప్టర్(ALH), నేవీ నౌకలు ఈ రెస్య్కూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.
మరోవైపు అత్యంత తీవ్రమైన బిపార్జాయ్ తుఫాన్ గుజరాత్ తీరం వైపు దూసుకోస్తోంది. తుఫాన్ తీరాన్ని చేరే కొద్ది గుజరాత్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బుధవారం ఉదయం దాదాపు ఉత్తరం వైపుగా కదులుతూ ఉత్తర-ఈశాన్య దిశలో సౌరాష్ట్ర,కచ్ జిల్లాలు, పాకిస్తాన్ తీరం మధ్యలో తుఫాన్ విరుచుకుపడనుంది. తీర ప్రాంతంలో గంటకు గరిష్టంగా 125-135 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని ఐఎండీ హెచ్చరించింది. కచ్, దేవభూమి ద్వారక, జామ్ నగర్, మోర్చి, జునాగర్, రాజ్ కోట్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.
Updates on ESCS #CycloneBiparjoy
In a nerve-racking mission, @IndiaCoastGuard Ship Shoor & ALH Mk-III (CG 858) augmented for evacuation of 50 personnel from Jack up rig “Key Singapore” off #Okha, #Gujarat. All 50 crew (26 crew on 12th Jun and 24 crew today) evacuated safely. pic.twitter.com/JYbTsn8GbJ
— Indian Coast Guard (@IndiaCoastGuard) June 13, 2023
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!