Minister KTR: ప్రజలు కోరుకునేది అభివృద్ధి సంక్షేమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లాలో ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా.. నగరంలో ఐటీ టవర్ ను ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కోరుకునేది అభివృద్ధి సంక్షేమమని తెలిపారు. ఎన్నికలు వస్తే సంక్రాంతి గంగిరెద్దుల వచ్చినట్లు వస్తారు.. జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ అగమైందని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక తెలంగాణలో ప్రతి వర్గం సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండటం కొందరికి నచ్చడం లేదని.. అందుకోసం లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
Kethika Sharma : మత్తెక్కించే పరువాలతో రెచ్చగొడుతున్న బ్రో బ్యూటీ..
Also Read
నిరుద్యోగ యువతకు ఓ వైపు శిక్షణ మరో వైపు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న నేతలే కలకాలం గుర్తుండిపోతారని ఆయన తెలిపారు. ప్రజల కోసం పనిచేసే వారినే వచ్చే ఎన్నికల్లో గెలిపించండని కోరారు. గతంలో పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచినా ప్రజలను పట్టించుకోలేదని.. సమైక్య పాలనలో తెలంగాణ ఆగమైందని కేటీఆర్ అన్నారు. వరి సాగులో నేడు తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని తెలిపారు. కేసీఆర్ విధానాల వల్లే నేడు నిండా చెరువులు పచ్చని పంటలు కనిపిస్తున్నాయని కేటీఆర్ అననారు
ISRO Recruitment 2023: టెన్త్ అర్హతతోఇస్రోలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
అంతేకాకుండా.. ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమాబాద్ ఎంపీ చిల్లరగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నిజమాబాద్ ఎంపీ సంస్కారంగా మాట్లాడాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా.. డిపాజిట్ కొల్లగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. 70 ఏళ్ల వయస్సున్న కేసీఆర్ ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. ధరలు పెంచిన బీజేపీ నేతలను నిలదీయండని అన్నారు. మరోవైపు 50 ఏళ్ళు అధికారం ఇస్తే కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. మళ్ళీ ఒక్క చాన్స్ అంటూ వస్తున్నారని.. 3 గంటల కాంగ్రెస్ కావాలా.. 3 పంటల కేసిఆరా.. మతం మంటలు పెడుతున్న బీజేపీ కావాలా అని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా.. నిజమాబాద్ కు రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
- Tags
- IT Hubm
- ktr
- Nizamabad
- start
- telugu news
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!