Ktr Meets Satya Nadella: భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సత్య నాదెళ్లతో ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. హైదరాబాద్లో జరిగిన వీరి సమావేశంలో ఐటీ, పారిశ్రామిక అభివృద్ధి వంటి విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఇవాళ్టి రోజును ప్రారంభించడం సంతోషంగా ఉంది. బిజినెస్, బిర్యానీ గురించి చాలా మాట్లాడుకున్నామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Delhi Mayor Polls: మేయర్ పీఠం కోసం కొట్లాట.. తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా
రాష్ట్రంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల అభివృద్ధి, హైదరాబాద్లో అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలను సత్యనాదెళ్లకు మంత్రి వివరించినట్లు తెలుస్తోంది. కొత్త సాంకేతికతపై ఇరువురూ చర్చించినట్లు తెలిసింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతోనూ సత్య నాదెళ్ల సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని సాధించేందుకు చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. డిజిటల్ పరివర్తన ద్వారా సుస్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వ లోతైన దృష్టిని చూడటం స్ఫూర్తిదాయకంగా ఉందని సత్య నాదెళ్ల అన్నారు. డిజిటల్ ఇండియా విజన్ని గ్రహించి ప్రపంచానికి వెలుగుగా నిలిచేందుకు భారతదేశానికి సహాయం చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని అని సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. డిజిటలైజేషన్పై కేంద్రం దృష్టి సారించడంపై ప్రశంసలు కురిపించారు. టెక్ దిగ్గజం భారతదేశం తన డిజిటల్ ఇండియా విజన్ను సాకారం చేయడంలో సహాయపడుతుందని చెప్పారు.
Good start to the day when two Hyderabadis get to catch up @satyanadella
We chatted about Business & Biryani 😊 pic.twitter.com/3BomzTkOiS
— KTR (@KTRBRS) January 6, 2023