Minister KTR : దుబ్బాకలో ఈ సారి రఘునందన్ రావు ఇంటికే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దుబ్బాకలో ఈ సారి రఘునందన్ రావు ఇంటికేనని ఆయన వ్యాఖ్యానించారు. రఘునందన్ రావుని లుచ్చా మాటలు అని ఆయన ఆరోపించారు. నిరుద్యోగికి 3 వేల నిరుద్యోగి భృతి అన్నాడు ఇచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. దుబ్బాకకి ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు తెచ్చాడా.. ఇంత బఫున్, జోకర్ మాటలు నమ్ముతారా అని మంత్రి కేటీఆర్ అన్నారు. అసైన్డ్ భూములు ఉన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని, దొంగ మాటలు, మాయ చేసి ఓ వెయ్యి ఓట్లతో ఉప ఎన్నికలో గెలిచాడన్నారు మంత్రి కేటీఆర్. దుబ్బాక ఎన్నిక తెలంగాణ తలరాతను మారుస్తుందని, కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు…పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు అని ఆయన అన్నారు.
Also Read : Atchannaidu: మత్స్యకారుల బతుకుల్ని ఆగం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే సొంతం..
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి 'రాగి బన్ దోస' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
అంతేకాకుండా..’24 గంటల కరెంట్ ఎక్కడుందో చూపించు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్, కాంగ్రెస్ నాయకులు కరెంట్ వైర్లని గట్టిగా పట్టుకోండి. కరెంట్ ఉందొ లేదో తెలుస్తుంది… పీడ పోతుంది. తెలంగాణ లో పేద రైతులు ఉన్నారు…మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారు. ఎద్దు తెలియదు, వ్యవసాయం తెలియదు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి. పబ్బు తెలుసు, గబ్బు తెలుసు వీళ్లకు. కాంగ్రెస్ లో రేవంత్ మూడు గంటల కరెంట్ చాలు అంటాడు. భట్టి ధరణి రద్దు చేస్తాం అంటాడు. ఉత్తమ్ రైతు బంధు దండగ అంటాడు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఒర్రుబోతు..టీవీలలో కూర్చొని ఒకటే ఒర్రుతాడు. కాంగ్రెస్ వాళ్ళకి కర్ణాటక నుంచి డబ్బులు వస్తున్నాయి. గుజరాత్ నుంచి బిజెపి వాళ్లకి డబ్బులు వస్తున్నాయి. తెలంగాణాని ఢిల్లీ గద్దల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ, అమిత్ షా, యోగి భోగి వెనుక 15 కేంద్రమంత్రులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే, డీకే, సిద్ధ రామయ్య అందరూ బయలు దేరారు. ఎవరు వచ్చినా సింహం సింగిల్ గా వస్తుంది. ఎవడో కాంగ్రెస్ కార్యకర్త ప్రభాకర్ అన్నను కత్తితో పొడిచాడు. మనం ఓటు అనే ఆయుధంతో వాళ్ళకి పోటు పొడవాలి. గాడిదలకు గడ్డి వేసి అవులకు పాలు పిండితే వస్తుందా.’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Neha sharma : బీచ్ లో సందడి చేస్తున్న బర్త్డే బ్యూటీ నేహా శర్మ..
తాజావార్తలు
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?