Kondapalli Srinivas: యువకులకు గుడ్ న్యూస్.. పారిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వ సాయం
- ఎమ్ఎస్ఎమ్ ఈ పరిశ్రమల ఏర్పాటు.. పాలసీ రూపకల్పనపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
- డ్వాక్రా గ్రూపులతో ఎమ్ఎస్ఎమ్ఈలు స్థాపించేలా ప్రొత్సహం
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్ఎస్ఎమ్ ఈ పరిశ్రమల ఏర్పాటు, పాలసీ రూపకల్పనపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. డ్వాక్రా గ్రూపులతో ఎమ్ఎస్ఎమ్ఈలు స్థాపించేలా ప్రొత్సహం ఇవ్వనున్నట్లు తెలిపారు. వివిధ రకాల ఉత్పత్తులకు కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈ లకు ప్రొత్సహం ఇచ్చే ఆలోచన ఉందన్నారు. జిల్లాల్లో డీఐసీలను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఆయా జిల్లాల్లో ఏయే పరిశ్రమల ఏర్పాటు చేయవచ్చనే సమాచారాన్ని డీఐసీల్లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. రానున్న కాలంలో 50 ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులను అభివృద్ధి చేయనున్నామన్నారు.
READ MORE: J-K Elections: జమ్మూ ఎన్నికల్లో నెహ్రూ ప్రస్తావన.. ఉగ్రవాద ఆరోపణలున్న రషీద్ నోట.. నెహ్రూ పేరు
Also Read
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
ఎమ్ఎస్ఎమ్ఈ డెవలప్మెంటే కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైజింగ్ అండ్ ఎక్సలరేటింగ్ ఎమ్ఎస్ఎమ్ఈ ప్రొగ్రాం-ఆర్ఏఎమ్ పీ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేలా చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు. ఆర్ఏఎమ్పీ స్కీం కింద కేంద్రం రూ. 100 కోట్లు ఇచ్చిందని.. ఎమ్ఎస్ఎమ్ఈ లకు రూ. 1500 కోట్ల మేర ప్రొత్సహాకాలను గత ప్రభుత్వం పెండింగులో పెట్టిందని చెప్పారు.
READ MORE: Vande Bharat: మరో 10 వందే భారత్ రైళ్లు లాంచ్.. 15న ప్రారంభించనున్న మోడీ
పెండింగులో ఉన్న ప్రొత్సహకాలను చెల్లించేలా ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలిచ్చారని.. ప్రొత్సహాకాల ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈల అభివృద్ధి.. పాలసీపై అధ్యయనం చేస్తున్నామన్నారు. యువకులు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చేలా పాలసీ రూపొందిస్తున్నామని తెలిపారు. క్రెడిట్ గ్యారెంటీ స్కీం ఫర్ ఎమ్ఎస్ఎమ్ఈ అనే కేంద్ర పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు చేపడుతున్నామన్నారు. క్రెడిట్ గ్యారెంటీ స్కీం ఫర్ ఎమ్ఎస్ఎమ్ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు పెడితే.. కేంద్రం రూ. 5000 కోట్లు ఇస్తారని చెప్పారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమల స్థాపన కోసం ఎమ్ఎస్ఎమ్ఈ-1 పేరుతో వెబ్ సైట్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
-
Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
-
Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..