Kollu Ravindra: గ్రామాల్లో తాగునీటి వనరుల కల్పన కోసం డీపీఆర్ సిద్దం చేయాలి..
- సాగునీటి కాల్వలు డ్రెయిన్లు నిర్వహణకు రూ. 55 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేయాలి..
- వర్షాకాలం వచ్చినా సాగునీటి కాల్వల నిర్వహణ చేపట్టకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన మంత్రి..
- వ్యవసాయ సీజన్ లో రైతులకు విత్తనాలు ఎరువులు కొరత లేకుండా చూడాలి: కొల్లు రవీంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లాలో సాగునీటి కాల్వలు డ్రెయిన్లు నిర్వహణకు 55 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్దం చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో 17 కోట్ల రూపాయలతో 63 పనులకు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. వర్షాకాలం వచ్చినా సాగునీటి కాల్వల నిర్వహణ చేపట్టకపోవడంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులను సాగునీటి కాల్వల్లో నీటి నిల్వలు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే, గ్రామాల్లో తాగునీటి వనరుల కల్పన కోసం డీపీఆర్ సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ సీజన్ లో రైతులకు విత్తనాలు ఎరువులు కొరత లేకుండా ముందుగానే ఇండెంట్ పెట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Hyderabad: కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రి.. నిరాకరించడంతో దారుణ హత్య
Also Read
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
అలాగే, బందరు పోర్టు పనులపై కూడా గనులు, భూగర్భవనరులు,ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరా తీశారు. రూ. 5, 156 కోట్ల రూపాయలతో నాలుగు బెర్తులతో 13 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో సామర్థ్యంతో 2025కి మొదటి దశ పనులు చేపట్టేలా పనులు చేస్తున్నట్టు మంత్రికి అధికారులు తెలిపారు. బందరు కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా మెరుగు పరచటంపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..