Hyderabad: కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రి.. నిరాకరించడంతో దారుణ హత్య
- పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసైన తండ్రి నరేష్
- తన కోరికను తీర్చాలని సొంత కూతురిని బలవంత పెట్టిన వైనం
- తండ్రి వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బెదిరించిన బాలిక
- గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మియాపూర్ బాలిక అనుమానాస్పద కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాలిక వసంతని తండ్రి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మియాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. తండ్రి నరేష్ బాలికను నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని బలవంత పెట్టాడు. తండ్రి కోరిక విని గట్టిగా అరిచింది ఆ బాలిక.. తండ్రి వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బెదిరించింది. పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు బాలిక తండ్రి బానోతు నరేష్.. తన కోరిక తీర్చాలంటూ బాలిక పై ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలికను హతమార్చి నిర్మానుష్య ప్రాంతం నుంచి బయటకు వచ్చాడు. వారం రోజుల తర్వాత బాలిక మిస్సింగ్ మిస్టరీ బయటపడింది. ఇంటి సమీపంలోనే బాలిక మృతదేహం లభ్యమైంది. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసుల దర్యాప్తు కొనసాగించారు. తండ్రి నరేష్ 11 నిమిషాల వ్యవధిలోనే బాలిక ను హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లాడు. వరుసగా మూడు రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూస్తూ వచ్చాడు.
READ MORE: CM Chandrababu: రేపు రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
తన కూతురు మిస్ అయినట్లు నరేష్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి నరేష్.. వారం రోజుల పాటు అస్సలు విషయం దాచాడు. నరేష్ హత్య చేసినట్లుగా పోలీసుల నిర్ధారించారు. స్వగ్రామం మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండల్ ఎల్లంపేట్ గ్రామం లక్ష్మన్ తండా అని తెలిపారు. బ్రతుకుదెరువు కోసం నరేష్ కుటుంబం నడిగడ్డ తండాకు వలసవచ్చింది. వచ్చిన 15 రోజులకే కన్న కూతురును హత్య చేశాడు కసాయి తండ్రి. నాలుగు బృందాలతో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు. మియాపూర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
తాజావార్తలు
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!