Minister Kakani Govardhan Reddy: తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పలేదు.. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kakani Govardhan Reddy: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే అరెస్ట్ చేశారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని.. స్కిల్ డెవలప్మెంట్కేసులో నిందితుడిగా న్యాయస్థానం నిర్ధారించిందన్నారు. బంద్కు పిలుపునిస్తే ప్రజల్లో స్పందన లేదన్నారు. చంద్రబాబును అవినీతి పరుడుగా ప్రజలు నమ్ముతున్నారని మంత్రి చెప్పారు. అందుకే ఎవరూ బయటకు రాలేదన్నారు. లోకేష్ తన ఎర్ర పుస్తకంలో ప్రధానంగా చంద్రబాబు పేరు రాసుకోవాలన్నారు. కేసులో అవినీతికి పాల్పడలేదని విచారణ సందర్భంగా చెప్పలేదన్నారు. తాను తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పలేదని మంత్రి వెల్లడించారు. కేబినెట్ నిర్ణయమని, తనకు సంబంధం లేదని చెబుతూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.
Also Read: Chandrababu Naidu Arrest Live Updates : సీఆర్పీసీలో హౌజ్ రిమాండ్ అనేదే లేదు: ఏపీ సీఐడీ
Also Read
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
- Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
అప్పట్లో జగన్కు సంబంధం లేకపోయినా కేసుల్లో ఇరికించారన్నారు. అప్పుడు కూడా కేబినెట్ నిర్ణయాలే కదా.. అప్పుడు జగన్ ఏ హోదాలోనూ లేరని ఆయన స్పష్టం చేశారు. “గతంలో కమ్యూనిస్టులు చంద్రబాబును అవినీతి పరుడన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే అక్రమం అంటున్నారు. అన్ని పథకాల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. పిల్లలకు ఇచ్చే శిక్షణలో రూ.370 కోట్ల మేర నిధులు మింగేశారు. 10 గంటలు వాదనలు విని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్డు మీద పడుకున్నారు. ఇద్దరూ ప్యాకేజీలు పంచుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో పవన్కు కూడా వాటాలు వచ్చాయి. రాజధాని పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారు. ప్రజల దృష్టి మరల్చి…అమరావతిలో తన అనుచరుల వద్ద భూములు కొని రాజధాని పెట్టించారు. ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు ముద్దాయి. పేదలకు చెందిన భూములను కొట్టేసిన చరిత్ర చంద్రబాబుది.” అంటూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..