S. Jaishankar: అరుణాచల్ప్రదేశ్ భారత్లో అంతర్భాగమే.. చైనా కొత్త మ్యాప్పై మంత్రి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా సోమవారం రిలీజ్ చేసిన కొత్త మ్యాప్ ను చైనా వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. అందులో తమ భూభాగంలో భారతదేశ ప్రాంతాలను చూపించింది. ఈ వ్యూహంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పందించారు. అసంబద్ధమైన వాదనలు చేయడం ద్వారా ఇతరుల భూభాగం మీది కాదన్నారు. ఓ వార్త ఛానల్ లో ఆయన మాట్లాడుతూ.. చైనాకు ఇలాంటి మ్యాప్లను జారీ చేసే అలవాటు ఉందని.. మీ అధికారిక మ్యాప్లో ఇతర దేశాల భూభాగాలను చేర్చడంలో అర్థం లేదని జైశంకర్ అన్నారు. చైనా.. భారతదేశానికి చెందిన ప్రాంతాలతో మ్యాప్ను విడుదల చేసిందని.. ఇది పాత అలవాటేనని.. కేవలం భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో మ్యాప్ను విడుదల చేయడం వల్ల ఎలాంటి మార్పు ఉండదని, తమ ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అసంబద్ధమైన దావాలు చేయడం వల్ల ఇతరుల ప్రాంతం మీది కాదని వ్యాఖ్యానించారు.
Read Also: KA Paul: విశాఖలో సీఐ కాలర్ పట్టుకుని కేఏ పాల్ ఓవరాక్షన్
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
చైనా జారీ చేసిన ప్రామాణిక మ్యాప్ను భారత్ తిరస్కరించింది. ఇందులో 1962 యుద్ధంలో ఆక్రమించిన అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్గా చైనా పిలుస్తుంది. అయితే అక్సాయ్ చిన్ కూడా దాని యాజమాన్యాన్ని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, భవిష్యత్తులో కూడా అది భారతదేశంలో భాగమేనని భారత్ చెబుతోంది. వచ్చే వారాంతంలో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సు, గత వారం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సు తర్వాత చైనా ఈ మ్యాప్ను విడుదల చేయడం గమనార్హం. చైనా మ్యాప్లో చేర్చబడిన ఇతర వివాదాస్పద ప్రాంతాలలో తైవాన్ మరియు దక్షిణ చైనా సముద్రంలోని పెద్ద భాగాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!