Jagadish Reddy: తెలంగాణలో ఎకరం అమ్మి.. ఆంధ్రలో 100 ఎకరాలు కొనొచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ కు ఓటేస్తే ఆ నేతలకు పదవులు.. బీఆర్ఎస్ కు ఓటేస్తే సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలు.. కులాలు, మతాల పేరు మీద దొంగలంతా ఏకమవుతున్నారు.. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత నాదేనని ఆయన వెల్లడించారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవు.. పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధి జరుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Revanth Reddy: మీటింగ్ పెడితే కరెంట్ కట్ చేస్తారా.. మీ నరాలు కట్ అవుతాయి.. రేవంత్ వార్నింగ్
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
- New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ఒక్కో గ్రామానికి అభివృద్ధి- సంక్షేమ కోసం కోట్లాది రూపాయల నిధులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంటు కష్టాలే.. కర్ణాటక పరిస్థితులే ఇక్కడా పునరావృతం అవుతాయి.. కాంగ్రెస్- బీజేపీ పాలిత కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో ఇచ్చే కరెంట్ 3 నుండి 6 గంటలేనని ఆయన ఆరోపించారు. నల్లగొండ కాంగ్రెస్ నాయకుల చేతగాని తనం వల్లే వరుసగా ఏడు ఏళ్లు ఎడమ కాలువ ఎండిపోయిందన్నారు. ఆంధ్రాలో ఎకరం అమ్ముకొని తెలంగాణలో 10 ఎకరాలు కొనే రోజులు పోయి.. తెలంగాణలో ఎకరం అమ్ముకొని ఆంధ్రలో 100 ఎకరాలు కొనే రోజులు వచ్చాయని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కళ్ళ ముందే మూసి నీరు లీక్ అవుతున్నా పట్టించుకోని పాపం గత పాలకులదే.. చెప్పిన మాట పైన నిలబడే నాయకుడు కేసీఆర్ అని ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!