Minister Indrakaran Reddy: నిమ్మరసం ఇచ్చిన మంత్రి.. దీక్ష విరమించిన నిర్మల్ రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామితో నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రైతులు తమ దీక్ష విరమించారు. ఆర్డీవో కార్యాలయం ముందు రైతుల దీక్ష శిబిరాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. మాస్టర్ ప్లాన్ పై మంత్రి ఎలాంటి ఆందోళన చెందవద్దు.. ఇది కేవలం డ్రాప్ట్ నోటిఫికేషన్ మాత్రమే.. ఇది ఫైనల్ మాస్టర్ ప్లాన్ కాదనేది ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. ప్రజల అభ్యంతరాలను, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వమని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
Read Also: Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావాలంటూ ప్రార్థనలు, పూజలు
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రజలకు, రైతులకు వ్యతిరేఖంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాల నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. వారి మాటలు నమ్మి మీరు మోసపోవద్దు అని మంత్రి పేర్కొన్నారు. గతంలో చెప్పాం.. ఇప్పుడు కూడా చెప్పుతున్నాం.. ఏ ఒక్కరికి ఎలాంటి నష్టం జరుగకుండా చూస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దీక్ష చేస్తున్న రైతులకు వివరించారు. దీంతో మంత్రి హామి మేరకు దీక్షను విరమిస్తున్నట్లు రైతులు ప్రకటించారు.
Read Also: Posani Krishna Murali: నన్ను హత్య చేసేందుకు లోకేష్ కుట్ర.. నేనే చచ్చిపోతే ఆయనదే బాధ్యత..!
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. రాజకీయాలకు అతీతంగా దీక్ష చేస్తున్నామని, మంత్రి హామీతో తాము దీక్ష విరమించామని రైతులు వెల్లడించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తాను 260 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.. వాటిలో నిజం లేదని ఆయన పేర్కొన్నాడు. నాకు ఎక్కడ భూమి ఉందో ప్రతిపక్ష నాయకులు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి తెలిపారు. లేదంటే ఆరోపణలు చేసిన వారు ముక్కు నేలకు రాసి తనకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. నిజాయితీగా ఉన్నాము కాబట్టే మూడు దశాబ్ధాలకు పైగా ప్రజలు మమల్ని ఆదరిస్తున్నారని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!