Harish Rao: గోదావరి జలాలను ములుగు నియోజకవర్గ ప్రజలకు అందిస్తాం
ములుగు జిల్లాలో మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలతో పాటు.. ములుగు మండలం రాంచంద్రపురం గ్రామంలోని 33/11 కేవి సబ్ స్టేషన్కి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రిలో SNCU వార్డు ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో 183కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేసామని తెలిపారు. రాష్ట్రంలో వైద్య విప్లవం సృష్టించింది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ వల్లే ములుగు జిల్లాగా ఏర్పడిందని.. కొత్త మెడికల్ కళాశాల సాధ్యమైందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ లేకుంటే.. ములుగు జిల్లా వచ్చేదా? మెడికల్ కళాశాల వచ్చేదా అని అన్నారు.
Read Also: Punjab: వ్యక్తి కడుపులో ఇయర్ ఫోన్స్, తాళాలు.. అవాక్కైన వైద్యులు..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేయడానికి ములుగు జిల్లానే స్ఫూర్తి అని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. బిడ్డకు పెళ్లి చెయ్యలేక ఇబ్బంది పడుతున్న తండ్రికి నాడు కేసీఆర్ అండగా నిలిచారని.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళ్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: ChatGPT: OpenAI వెబ్ బ్రౌజింగ్ ఫీచర్ని ఎలా ప్రారంభించాలంటే?
కొత్తగూడ గంగారం పరిధిలో మండల phc కోసం ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ములుగు జిల్లాలో పోడు భూముల వల్ల నష్టపోయిన గిరిజన ఇతరులకు కూడా హక్కు పట్టాలను మంజూరు మంజూరు చేసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా.. గోదావరి జలాలను ములుగు నియోజకవర్గ ప్రజలకు సాగునీరు, మంచినీటిని కూడా అందిస్తామన్నారు. ములుగు నియోజకవర్గం మరో 2000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయడం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఏటునాగారం రెవెన్యూ డివిజన్ డిమాండ్ ను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో