పాలమూరు ప్రజలు సీఎం కేసీఆర్ కి, గ్రామ దేవతలకు అభిషేకాలు చేస్తే కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్ళు వస్తున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు ప్రాజెక్ట్ పెండింగ్ ప్రాజెక్ట్ గా మారింది అని ఆయన దుయ్యబాట్టారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్ట్ లు కట్టకుండా కేసులు వేయడం.. అడ్డుకోవడం చేస్తున్నారు అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు తిట్లు తిట్టేవారు కావాలా? కిట్లు ఇచ్చేవారు కావాలా? మీరు తేల్చుకోండి అంటూ హరీశ్ రావు పేర్కొన్నారు.
Read Also: NC 23: మరోసారి కలిసి నటించనున్న సాయి పల్లవి-నాగ చైతన్య…
వచ్చే ఎన్నికలలో గ్లోబల్స్ కి నోబల్స్ కి మధ్య పోటీ ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. 50 ఎండ్లలో అభివృద్ధి చేయలేదు కానీ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెబుతున్నారు.. ప్రజల నాయకుడు మన సీఎం కేసీఆర్ నీ మీరంత మరోసారి దీవించండి అని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది దేశంలో మరెక్కడ కూడా జరగడం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి సీఎం మనకు ఉన్నందుకు తెలంగాణ ప్రజలు గర్వం పడుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Read Also: Trisha Krishnan Pics: ఈ ఏజ్లో కూడా ఇంత అందమా.. సౌత్ క్వీన్ ‘త్రిష’ లేటెస్ట్ పిక్స్ చూశారా!
ఎన్నికల్లో గెలిచేందుకు కొందరు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. అలాంటి వారికి ప్రజలే తగిన బుద్ది చెప్పాలని మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాభివృద్దికి కృషి చేసిన కేసీఆర్.. దేశంలోనే నెంబర్ రాష్ట్రంగా నిలిపాడ.. విద్య, వైద్య రంగాల్లో మరింత మెరుగైన సేవలను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.