Harish Rao: బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం మరో చరిత్ర కాబోతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభలు జరగుతున్నాయి. సిద్దిపేటలో మంత్రి హరీష్రావు అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభలో ఆయన ప్రసంగించారు. గులాబీ నీడ కింద చల్లగా ఉన్నామంటే దానికి కారణం కేసీఆర్ అని నేతలకు మంత్రి సూచించారు. రైతు నాగలితో ఆకు పచ్చ చరిత్రను కేసీఆర్ రాశారన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి కేసీఆర్ అని.. హిస్టరీలు క్రియేట్ చేయడం కేసీఆర్కి కొత్తేమి కాదన్నారు. తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవి, కేంద్ర మంత్రి, ఎంపీ పదవులను త్యాగం చేయడం కేసీఆర్ హిస్టరీ అంటూ మంత్రి హరీష్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం మరో చరిత్ర కాబోతోందన్నారు. ఆనాడు తిండి కోసం తిప్పలు పడ్డామని.. కానీ ఈనాడు దేశానికే ధాన్యం పెట్టే స్థాయికి ఎదిగామన్నారు. తెలంగాణలో ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నాడని మంత్రి హరీష్ తెలిపారు.
ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్ళు మన పథకాలు కాపీ కొడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నితిన్ గడ్కరీ కాళేశ్వరం అద్భుతం అన్నారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్లో స్వయంగా చెప్పారని.. ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ప్రాజెక్టుల గురించి అడుగుతారని.. గల్లీల్లో మాత్రం ప్రధాని మనపై విమర్శలు చేస్తారన్నారు. ఆయన తప్పుల్ని ప్రశ్నించినందుకే కేసీఆర్ చెడ్డోళ్లు అయిపోయారన్నారని ప్రధానిని ఉద్దేశించి పేర్కొన్నారు. అడిగితే సీబీఐ, ఈడీ, ఐటీ రైడ్స్ చేసి బెదిరిస్తారని విమర్శించారు. కేసీఆర్ వీటికి భయపడడని మంత్రి చెప్పారు.
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Read Also: Opposition unity: ప్రధాని పదవి ఖాళీ లేదు.. మమత- నితీష్ భేటీపై బీజేపీ ఎద్దేవా
నిజాన్ని మనం ప్రచారంలో పెట్టాలని నేతలకు మంత్రి సూచించారు. వచ్చే రెండు నెలల్లో సిద్దిపేటకి రైలు వస్తుందని చెప్పారు. ప్రధాని మన్ కీ బాత్లో తియ్య తియ్యని మాటలు చెబుతారని.. కానీ మన్ కీ బాత్ కాదు.. కిసాన్ కీ బాత్ వినాలన్నారు. అదానీ, అంబానీల ఆస్తులు పెంచడమే బీజేపీ పని అని మంత్రి విమర్శలు గుప్పించారు. తెలంగాణకు సమాధులు తవ్వేటోడు, కూలగొట్టెటోడు కాదు.. బలమైన పునాదులు కావాలన్నారు. సిద్దిపేట ప్రజలకు చివరి శ్వాస వరకు సేవ చేస్తానని మంత్రి పేర్కొన్నారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని.. రైతులు అధైర్య పడవద్దు అంటూ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!