Harish Rao: కేంద్రం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోంది
తెలంగాణ ప్రజల స్థితిగతులు మార్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ యార్డులో గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్, పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు కేంద్రంపై మండిపడ్డారు. బావుల దగ్గర విద్యుత్ మీటర్లు పెట్టడం లేదని 12 వేల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ ఇవ్వకుండా కేంద్రం ఆపిందన్నారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు 40 వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే డబ్బును ఆపేసి రాష్ట్ర ప్రజలను తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు.
గతంలో యాసంగి పంట అంటే గాలిలో దీపం ఇప్పుడు సంవత్సరానికి గజ్వేల్ రైతులు రెండు పంటలు తీస్తున్నారు. సీఎం కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే పరిస్థితి మరోలా ఉండేది. ఏళ్ల తరబడి ఏనాడు మత్తడి దూకని కూడేల్లి వాగు ఇవాళ మత్తడి దూకుతుంది అంటే అది కేసీఆర్ వల్లనే అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రి హరీష్ రావు. అంతకుముందు హరీష్ రావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గజ్వేల్ లో క్రైస్తవ భవన్ లో తెలంగాణ ప్రభుత్వం తరపున క్రైస్తవులకు క్రిస్మస్ బట్టలు పంపిణీ, విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
Read Also: China: చైనా కుయుక్తులు.. సరిహద్దు వెంబడి యుద్ధవిమానాల మోహరింపు
కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు క్రీస్తు సోదరసోదరీమణులందరికీ క్రిస్ట్ మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు మంచిని మంచిగా.. చెడును చెడుగా చూడాలని చెప్పారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం పని చేసే మహా గొప్ప నాయకుడు. సీఎం కేసీఆర్ ప్రతీ పండుగను ఘనంగా జరుపుతున్నారు. సమ్మక్క-సారాలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరినా విస్మరించింది. కానీ సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగగా జరిపిస్తున్నారన్నారు మంత్రి హరీష్ రావు.
Read Also: FIFA World Cup: సేమ్ టు సేమ్.. సచిన్కు జరిగిందే.. మెస్సీకి జరిగింది..!!
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!