Harish Rao : ఇది ముమ్మాటికీ మునుగోడు ప్రజల గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేదానికి తెరపడింది. గత రెండు నెలలుగా మునుగోడు మేనియా తెలంగాణ హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరిగింది. అయితే.. ఎంతో ఉత్కంఠగా సాగిన మునుగోడు ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అయితే.. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుపై తాజా మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. బీజేపీ కుట్రలను ఛేదించిన మునుగోడు ఓటర్లకు ధన్యవాదాలు అని అన్నారు. అంతేకాకుండా.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ కుట్రలకు మధ్య జరుగుతున్న పోరాటంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలిచిన మునుగోడు ప్రజానీకానికి ధన్యవాదాలు అన్నారు. తెలంగాణ సమాజం తెలంగాణ పక్షాన ఉన్నదని మరోసారి రుజువైంది. మునుగోడు ప్రజలు చైతన్యానికి మరోపేరు అని నిరూపించుకున్నారు.
Also Read : Bhakthi TV Koti Deepotsavam 2022: ఏడవరోజు విశిష్టంగా సాగిన కోటి దీపోత్సవం
బీజేపీ కేంద్ర నాయకత్వానికి కర్రుకాల్చివాతపెట్టారు. ఇది ముమ్మాటికీ మునుగోడు ప్రజల గెలుపు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తున్న బీజేపీ, మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను తన పార్టీలో చేర్చుకొని మునుగోడుపై ఎన్నికలను రుద్దింది. • బీజేపీ అహంకారాన్ని మునుగోడు ప్రజలు అణచివేశారు. ఇదో అద్భుతసందర్భం. ఇదే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షిస్తున్న. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశరాజకీయాల్లో గుణాత్మకమార్పుకు మునుగోడు ఫలితం నాందివాచకం. సీఎం కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన సంపూర్ణ మద్ధతుకు ఈ విజయం నిదర్శనం.
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
Also Read : Rajasthan: ఇదేం మూఢనమ్మకం.. కొడుకు ఆరోగ్యం కోసం కూతురును బలి ఇచ్చిన తల్లి!
అధికారం, డబ్బులు, ప్రలోభాల కన్నా ప్రజాస్వామ్యం గొప్పదని మునుగోడు ప్రజలు రుజువు చేసిన వైనం చరిత్రాత్మకం.కాంట్రాక్టులు-కమిషన్లు కాదు. విషం- విద్వేషం కాదు. తెలంగాణకు కావాల్సింది అభివృద్ది – సంక్షేమం అని మునుగోడు ప్రజలు తెల్చి చెప్పారు. ఈ ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన నాయకత్వ స్ఫూర్తితో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సైనికుల్లా పరిశ్రమించిన తీరుకు అభినందనలు. మునుగోడు ఉపఎన్నికల్లో అన్ని వర్గాలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చిన తీరు, ఆయన నాయకత్వంపై చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు. సీపీఎం, సీపీఐ పార్టీలు మునుగోడులో ఇచ్చిన మద్ధతుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
•కేసీఆర్ గారి నాయకత్వం దేశానికి కొత్త దశ- దిశ అందిస్తుందని ఈ ఉపఎన్నిక ద్వారా ప్రజలు దేశాని కొత్త సందేశం ఇచ్చారు. అందుకు వారికి మరో సారి శిరస్సు వంచి నమస్కరిస్తున్న. ఈ ఎన్నికల్లో మాకు ఆద్యంతం శక్తిని, స్ఫూర్తిని నింపిన మా నాయకుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, నాయకులకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు.’ అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!