Gudivada Amarnath: ‘ఆడుదాం ఆంధ్రా’లో మంత్రి సూపర్ బ్యాటింగ్.. సిక్క్లు, ఫోర్లతో విరిచుకుపడ్డ అమర్నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: యువతలో దాగిఉన్న క్రీడాలను బయటకు తీయడానికి ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా జరిగిన క్రికెట్ మ్యాచ్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ రెచ్చిపోయారు.. సిక్స్లు, ఫోర్లతో చెలరేగిపోయారు.. మొత్తంగా 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ సాధించారు.. విశాఖలోని DLB గ్రౌండ్ లో ఆడుదాం-ఆంధ్రా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.. అమర్ లెవన్ కు కెప్టెన్ గా మంత్రి గుడివాడ అమర్నాథ్, KKR లెవన్ కెప్టెన్ నార్త్ కో ఆర్డినేటర్ కేకే రాజు వ్యవహించారు.. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ను మంత్రి, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఆడారు..
Read Also: DK Aruna: ఆ మూడు పార్టీ లు ఒక్కటే.. ఎవరు ఎవరితో కలిశారనేది ఇప్పుడు కనిపిస్తుంది..
Also Read
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
ఇక, ఆడుదాం ఆంధ్రా క్రికెట్ మ్యాచ్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ అద్భుత బ్యాటింగ్ చేశారు.. రెండు సిక్స్ లు, రెండు ఫోర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ ఆయన.. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేశారు.. మొత్తంగా అమర్ లెవెన్ వెర్సస్ కేకేఆర్ ఫ్రెండ్లీ మ్యాచ్ లో మంత్రి అమర్నాథ్ ఆసక్తికరమైన ఇన్నింగ్స్ ఆడారు.. మంచి ఫుట్వర్క్తో ఆకట్టుకున్నారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆడుదాం-ఆంధ్రాను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. కుల, మతాలకు అతీతంగా జరిగే క్రీడలపై దుష్ప్రచారం చేయడం దూరదృష్టకరమన్న ఆయన.. విమర్శలు చేస్తున్న టీడీపీ నాయకత్వం.. 14 ఏళ్ళు అధికారంలో వున్నప్పుడు ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు..? అని నిలదీశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Read Also: Rinku Singh: క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్.. వీడియో వైరల్!
మరోవైపు.. అట్టహాసంగా ప్రారంభమైంది ఆడుదాం-ఆంధ్రా స్పోర్ట్స్ మీట్ …. ఎన్. ఏ. డి. జంక్షన్ నుంచి DLB గ్రౌండ్స్ వరకు వైసీపీ యువజన విభాగం భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది.. బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్.. ఆడుదాం-ఆంధ్రా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు క్రికెటర్ అంబటి రాయుడు.. క్రీడా నైపుణ్యాన్ని పెంపొందిస్తే.. విద్యార్థులు క్రీడల ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు వస్తాయని.. ఆడుదాం ఆంధ్రాలో అనేక క్రీడలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పొందుపరిచారని.. రాష్ట్రం మొత్తం అందరు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!