Damodar Raja Narsimha: గాంధీ, ఉస్మానియా బలోపేతానికై ఫార్మా కంపెనీలు ఆ నిధులను అందించాలి..
- ఫార్మా కంపెనీ ప్రతినిధులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ భేటీ
- గాంధీ..ఉస్మానియా ఆస్పత్రుల బలోపేతానికై సీఎస్ఆర్ నిధులను అందించాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodar Raja Narsimha: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనలకు ఫార్మా కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర వైద్యారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమావేశం నిర్వహించారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల పూర్వ వైభవానికి సామాజిక బాధ్యతగా ఫార్మా కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధులను విరివిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ప్రాధాన్యత రంగాలైన పేషెంట్ కేర్, శానిటేషన్, డైట్, బయో – మెడికల్ వేస్టేజ్, డ్రింకింగ్ వాటర్ సప్లైలతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించటానికి అవసరమైన సిబ్బంది, విద్య, వైద్య రంగాలతో పాటు గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ లాంటి అంశాలలో ఫార్మా కంపెనీలు తమ సీఎస్ఆర్ ఫండ్స్ను అందించాలని కోరారు. మంత్రి విజ్ఞప్తి మేరకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల బలోపేతానికి ఫార్మా కంపెనీలు తమ సీఎస్ఆర్ విధులను విడుదల చేసేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
Read Also: Telangana: షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు
Also Read
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
రాష్ట్రంలోని 12 ప్రముఖ ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఈ వారంలో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో ప్రాధాన్యత కలిగిన అంశాలపై టెక్నికల్గా నివేదికను సమర్పిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో రోగులకు అవసరమైన, నాణ్యమైన, మెరుగైన సేవలను అందించేందుకు, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సమర్పించాలని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరిండెంట్లను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!