Damodar Raja Narsimha: గాంధీ, ఉస్మానియా బలోపేతానికై ఫార్మా కంపెనీలు ఆ నిధులను అందించాలి..
- ఫార్మా కంపెనీ ప్రతినిధులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ భేటీ
- గాంధీ..ఉస్మానియా ఆస్పత్రుల బలోపేతానికై సీఎస్ఆర్ నిధులను అందించాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodar Raja Narsimha: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనలకు ఫార్మా కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర వైద్యారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమావేశం నిర్వహించారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల పూర్వ వైభవానికి సామాజిక బాధ్యతగా ఫార్మా కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధులను విరివిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ప్రాధాన్యత రంగాలైన పేషెంట్ కేర్, శానిటేషన్, డైట్, బయో – మెడికల్ వేస్టేజ్, డ్రింకింగ్ వాటర్ సప్లైలతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించటానికి అవసరమైన సిబ్బంది, విద్య, వైద్య రంగాలతో పాటు గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ లాంటి అంశాలలో ఫార్మా కంపెనీలు తమ సీఎస్ఆర్ ఫండ్స్ను అందించాలని కోరారు. మంత్రి విజ్ఞప్తి మేరకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల బలోపేతానికి ఫార్మా కంపెనీలు తమ సీఎస్ఆర్ విధులను విడుదల చేసేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
Read Also: Telangana: షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు
Also Read
రాష్ట్రంలోని 12 ప్రముఖ ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఈ వారంలో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో ప్రాధాన్యత కలిగిన అంశాలపై టెక్నికల్గా నివేదికను సమర్పిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో రోగులకు అవసరమైన, నాణ్యమైన, మెరుగైన సేవలను అందించేందుకు, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సమర్పించాలని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరిండెంట్లను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
తాజావార్తలు
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!