Botsa Satyanarayana: సిద్ధం, బై బై పదాలు మావే.. కాపీ కొట్టి వాడుకుంటున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: సిద్ధం, బై బై పదాలు మావే.. కాపీ కొట్టి వాడుకుంటున్నారు అంటూ విపక్షాలపై ఫైర్ అయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని మోడీతో కూటమి చెప్పిస్తే గాజువాక నుండి అమర్, విశాఖ ఎంపీ పోటీ నుండి బొత్స ఝాన్సీ తప్పుకుంటారని సవాల్ చేశారు. చంద్రబాబు మీటింగ్ లలో మాట్లాడే భాష చాలా ఘోరంగా వుంది.. మీ భాషని అదుపులో పెట్టుకోండి.. బజారు మాటలు మాట్లాడకండి.. నోరు జారి మాట్లాడి మీ స్థాయిని దిగజార్చుకోకండి.. చంద్రబాబు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు సీఎంగా చెయ్యడం మన దౌర్భాగ్యం.. చంద్రబాబుకి పేదలంటే ఎందుకు అంత కోపం.. ఆన్ గోయింగ్ లో వుండే పథకాలు లబ్దిదారులకు అందకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా అడ్డుకోవడం ఘోరం అంటూ మండిపడ్డారు.
Read Also: Thummala Nageswara Rao: చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం తుమ్మల 18 పాయింట్స్..
Also Read
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
లబ్ధిదారులు అధైర్య పడకండి.. ఎన్నికలు అవ్వగానే మే 14న లబ్ధిదారులకు రావాల్సిన పథకాలు అందుతాయి. చంద్రబాబుకి ఓడిపోతాననే ప్రెస్టేషన్ బాగా పెరిగిపోయి ఏమి చేస్తున్నాడో అర్ధం కావడంలేదని ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు తానా అంటే తందానా అంటున్నాడు.. కూటమి మేనిఫెస్టోతో తమకు సంబంధం లేనట్టుగా, మేనిఫెస్టోని అంటరానితనంగా బీజేపీ చూస్తుందన్నారు. చంద్రబాబు కొడుకు పెద్ద శుంట.. ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్, సీఎం జగన్ కోసం మాట్లాడే స్థాయి వుందా..? అని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మేం చేసిన కార్యక్రమాలని కాపీ కొట్టి అవే చేస్తున్నారు.. సిద్ధం, బై బై పదాలు మావే, ఇవి కాపీ కొట్టి వాళ్లు వాడుకుంటున్నారు.. మా మేనిఫెస్టోని కూడా కాపీ కొట్టారు, చంద్రబాబు, పవన్ కల్యాణ్కి సిగ్గుండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దెబ్బకు చంద్రబాబు తన ఒరిజినాలిటీని కోల్పోయి, అన్ని కాపీ చంద్రబాబుగా తయారయ్యాడు అని సెటైర్లు వేశారు. ప్రతి దానిని రాజకీయంగా చూడకండి, పేదలకు జరిగే మంచికి అడ్డుకోకండి అని హితవుపలికారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
-
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!