Minister Botsa Satyanarayana: కేంద్రంపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి తాము వ్యతిరేకమని, ఎందుకు వ్యతిరేకమో ఇప్పటికీ పార్టీ చెప్పిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. టీడీపీ స్టాండ్ ఏంటో చంద్రబాబు చెప్పాలన్నారు. వ్యతిరేకిస్తే ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని.. దాక్కుంటే కుదరదన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్న చంద్రబాబు… తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేతులలో నుంచి పోలవరాన్ని తీసుకున్నది చంద్రబాబు.. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని బొత్స సత్యనారాయణ విమర్శించారు.
Also Read: Pothula Sunitha: జగన్పై బురద జల్లేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారు..
పోలవరంను బ్రష్టు పట్టించింది ఎవరు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. స్వార్ధం కోసం పోలవరంను నాశనం చేసింది చంద్రబాబు కాదా అంటూ మండిపడ్డారు. డయాఫ్రం వాల్ ఎందుకు కొట్టుకుపోయిందంటూ ఆయన ప్రశ్నలు కురిపించారు. జాతీయ ప్రాజెక్టుగా చంద్రబాబు ఎందుకు అంగీకరించారో చెప్పాలన్నారు. చంద్రబాబు ఇస్తున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎవరికోసమంటూ ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏమి చేశారని మంత్రి ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు ప్రజలు ఎందుకు గుర్తుకి రారని ఆయన మండిపడ్డారు.
