Minister BC Janardhan Reddy: రూ.160కే కిలో కందిపప్పు.. రూ.48కే బియ్యం
- సబ్సిడీ ధరలతో నిత్యావసర సరుకుల ప్రత్యేక కౌంటర్..
- నంద్యాల జిల్లా బనగానపల్లెలో ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..
- కిలో కంది పప్పు రూ.160కి.. సోనా మసూరి బియ్యం కిలో రూ.48కే ఇస్తున్నాం..
- మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసమే సబ్సిడీ ధరలతో నిత్యవసర సరుకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister BC Janardhan Reddy: కంది పప్పు, బియ్యం ధర పెరిగిపోవడంతో.. సామాన్యులకు సబ్సిడీపై కంది పప్పు, బియ్యం పంపిణీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం.. ఈ రోజు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సబ్సిడీ ధరలతో నిత్యావసర సరుకుల ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిలో కంది పప్పు రూ.160లకు, సోనా మసూరి బియ్యం కిలో రూ.48కే ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నట్టు వెల్లడించారు.. మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసమే సబ్సిడీ ధరలతో నిత్యవసర సరుకులు సరఫరా చేస్తున్నామన్న ఆయన.. రైతు బజార్లకు సమాంతరంగా పేద ప్రజల కోసం సబ్సిడీ ధరల కౌంటర్లను తీర్చిదిద్దుతాం అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల కారణం గానే పేద ప్రజలను ఆదుకునేందుకు నిత్యవసర సరుకుల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక సబ్సిడీ కేంద్రాలను ప్రారంభిస్తాం.. త్వరలోనే అన్ని రకాల ధాన్యాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాగా, సామాన్యులకు తక్కువ ధరకే కంది పప్పు, బియ్యం పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్లోని నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే.
Read Also: Secret Room : నేడు తిరిగి తెరుచుకోనున్న పూరిలోని జగన్నాథస్వామి ఆలయం రహస్య గది
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
కాగా, బనగానపల్లె పట్టణంలో గల గ్రంథాలయం పక్కన ఉన్నగ్రామపంచాయతీ సంబంధించిన రూమ్ నెంబర్ 1లో హోల్ సేల్ వ్యాపారస్తులు మరియు రైస్ మిల్లుల ఓనర్ల సహాయంతో సబ్సిడీతో నిత్యావసర వస్తువులను అందించేందుకు ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయగా.. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్, డోన్ రెవిన్యూ డివిజనల్ అధికారి, ఇతర అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!