Minister BC Janardhan Reddy: రూ.160కే కిలో కందిపప్పు.. రూ.48కే బియ్యం
- సబ్సిడీ ధరలతో నిత్యావసర సరుకుల ప్రత్యేక కౌంటర్..
- నంద్యాల జిల్లా బనగానపల్లెలో ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..
- కిలో కంది పప్పు రూ.160కి.. సోనా మసూరి బియ్యం కిలో రూ.48కే ఇస్తున్నాం..
- మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసమే సబ్సిడీ ధరలతో నిత్యవసర సరుకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister BC Janardhan Reddy: కంది పప్పు, బియ్యం ధర పెరిగిపోవడంతో.. సామాన్యులకు సబ్సిడీపై కంది పప్పు, బియ్యం పంపిణీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం.. ఈ రోజు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సబ్సిడీ ధరలతో నిత్యావసర సరుకుల ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిలో కంది పప్పు రూ.160లకు, సోనా మసూరి బియ్యం కిలో రూ.48కే ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నట్టు వెల్లడించారు.. మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసమే సబ్సిడీ ధరలతో నిత్యవసర సరుకులు సరఫరా చేస్తున్నామన్న ఆయన.. రైతు బజార్లకు సమాంతరంగా పేద ప్రజల కోసం సబ్సిడీ ధరల కౌంటర్లను తీర్చిదిద్దుతాం అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల కారణం గానే పేద ప్రజలను ఆదుకునేందుకు నిత్యవసర సరుకుల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక సబ్సిడీ కేంద్రాలను ప్రారంభిస్తాం.. త్వరలోనే అన్ని రకాల ధాన్యాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాగా, సామాన్యులకు తక్కువ ధరకే కంది పప్పు, బియ్యం పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్లోని నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే.
Read Also: Secret Room : నేడు తిరిగి తెరుచుకోనున్న పూరిలోని జగన్నాథస్వామి ఆలయం రహస్య గది
Also Read
- Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
- Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
కాగా, బనగానపల్లె పట్టణంలో గల గ్రంథాలయం పక్కన ఉన్నగ్రామపంచాయతీ సంబంధించిన రూమ్ నెంబర్ 1లో హోల్ సేల్ వ్యాపారస్తులు మరియు రైస్ మిల్లుల ఓనర్ల సహాయంతో సబ్సిడీతో నిత్యావసర వస్తువులను అందించేందుకు ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయగా.. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్, డోన్ రెవిన్యూ డివిజనల్ అధికారి, ఇతర అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
India Tractor Sales: ఒక్క నెలలో 83,000 ట్రాక్టర్లు సేల్.. ఈ బ్రాండ్ కే జై కొట్టిన రైతులు
-
Dil Raju: 300 కోట్ల బడ్జెట్లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్పై దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!