Secret Room : నేడు తిరిగి తెరుచుకోనున్న పూరిలోని జగన్నాథస్వామి ఆలయం రహస్య గది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secret Room : ఒడిశాలోని పూరీ జగన్నాథస్వామి రత్న భాండాగారం రహస్య గది తలుపులు నేడు తెరుచుకోనున్నాయి. ఇందుకోసం ఉదయం 9.51 గంటల నుంచి 12.15 గంటల వరకు శుభ ముహూర్తంగా నిర్ణయించారు. దీంతో ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. మంగళవారం రత్న భాండాగారం అధ్యయన కమిటీ అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సమావేశం అనంతరం జస్టిస్ రథ్, ఆలయ కార్యనిర్వహణాధికారి అరవింద పాధి విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈ నెల 14న ఖజానాలోని మొదటి రెండు గదుల్లోని పురుషోత్తముడి సంపదను తీసి తాత్కాలిక స్ట్రాంగ్రూమ్కు తరలించాం. ఇదంతా వీడియో తీశారు. ఈ నెల 18న సీక్రెట్ రూమ్ను తెరిచి మరో తాత్కాలిక స్ట్రాంగ్రూమ్లో నిధులు భద్రపరుస్తాం. తర్వాత ఈ గోదామును మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు అప్పగిస్తాం. పని పూర్తయిన తర్వాత, సంపద మొత్తాన్ని తిరిగి రహస్య గదికి తీసుకువచ్చి నగలు లెక్కించబడతాయి. గురువారం ఉదయం నుంచి రహస్య గది తెరవడంతో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ పాలకమండలి ప్రకటించింది.
Also Read
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
Read Also : Catch Viral Video: కొండ ప్రాంతాల్లో స్టన్నింగ్ క్యాచ్.. సూర్యకుమార్ క్యాచ్తో పోలుస్తున్న అభిమానులు!
46 ఏళ్ల తర్వాత ఆదివారం రహస్య గదిని తెరిచిన అధికారులు సమయాభావం వల్ల సంపదను లెక్కకట్ట కుండానే తిరిగి గదికి సీజ్ చేశారు. ఇన్నర్, ఔటర్ గదులలోని సంపదను ఆదివారం తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించి అధికారులు భద్రపరిచారు. నిన్న ఘనంగా స్వామివారి సున్నా భేషో వేడుక నిర్వహించారు. ప్రధాన ఆలయం బయట రథాలపై కొలువుతీరిన జగన్నాథ స్వామి, బలభద్ర, శుభద్రలకు సున్నాభేషో వేడుకలో భాగంగా అభరణాలు అలంకరించారు. ఇన్నర్, ఔటర్ గదుల నుంచి ఆదివారం తరలించిన అభరణాలను అర్చకస్వాములు అలంకరించారు. నేడు రహస్య గదిని తెరిచి అందులోని సంపదను అధికారులు తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కి తరలించనున్నారు. అనంతరం రహస్యగదికి మరమ్మత్తులు చేపట్టనున్న పురావస్తు శాఖ, రహస్య గది భద్రతను అధికారులు పరిశీలించనున్నారు. మరమ్మత్తులు పూర్తయ్యాక తిరిగి రహస్యగదికి తరలించి సంపదను లెక్కకట్టనున్నారు. రహస్య గది లెక్కింపుకు 30 నుంచి 40 రోజుల సమయం పట్టవచ్చని ఒరిస్సా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ తెలిపారు.
Read Also :Viral Video : కొడుకుకు నరకం చూపిన తల్లి.. మీద కూర్చొని, తల నేలకేసి కొడుతూ..ఛాతిపై కొరుకుతూ
తాజావార్తలు
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!