Secret Room : నేడు తిరిగి తెరుచుకోనున్న పూరిలోని జగన్నాథస్వామి ఆలయం రహస్య గది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secret Room : ఒడిశాలోని పూరీ జగన్నాథస్వామి రత్న భాండాగారం రహస్య గది తలుపులు నేడు తెరుచుకోనున్నాయి. ఇందుకోసం ఉదయం 9.51 గంటల నుంచి 12.15 గంటల వరకు శుభ ముహూర్తంగా నిర్ణయించారు. దీంతో ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. మంగళవారం రత్న భాండాగారం అధ్యయన కమిటీ అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సమావేశం అనంతరం జస్టిస్ రథ్, ఆలయ కార్యనిర్వహణాధికారి అరవింద పాధి విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈ నెల 14న ఖజానాలోని మొదటి రెండు గదుల్లోని పురుషోత్తముడి సంపదను తీసి తాత్కాలిక స్ట్రాంగ్రూమ్కు తరలించాం. ఇదంతా వీడియో తీశారు. ఈ నెల 18న సీక్రెట్ రూమ్ను తెరిచి మరో తాత్కాలిక స్ట్రాంగ్రూమ్లో నిధులు భద్రపరుస్తాం. తర్వాత ఈ గోదామును మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు అప్పగిస్తాం. పని పూర్తయిన తర్వాత, సంపద మొత్తాన్ని తిరిగి రహస్య గదికి తీసుకువచ్చి నగలు లెక్కించబడతాయి. గురువారం ఉదయం నుంచి రహస్య గది తెరవడంతో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ పాలకమండలి ప్రకటించింది.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Read Also : Catch Viral Video: కొండ ప్రాంతాల్లో స్టన్నింగ్ క్యాచ్.. సూర్యకుమార్ క్యాచ్తో పోలుస్తున్న అభిమానులు!
46 ఏళ్ల తర్వాత ఆదివారం రహస్య గదిని తెరిచిన అధికారులు సమయాభావం వల్ల సంపదను లెక్కకట్ట కుండానే తిరిగి గదికి సీజ్ చేశారు. ఇన్నర్, ఔటర్ గదులలోని సంపదను ఆదివారం తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించి అధికారులు భద్రపరిచారు. నిన్న ఘనంగా స్వామివారి సున్నా భేషో వేడుక నిర్వహించారు. ప్రధాన ఆలయం బయట రథాలపై కొలువుతీరిన జగన్నాథ స్వామి, బలభద్ర, శుభద్రలకు సున్నాభేషో వేడుకలో భాగంగా అభరణాలు అలంకరించారు. ఇన్నర్, ఔటర్ గదుల నుంచి ఆదివారం తరలించిన అభరణాలను అర్చకస్వాములు అలంకరించారు. నేడు రహస్య గదిని తెరిచి అందులోని సంపదను అధికారులు తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కి తరలించనున్నారు. అనంతరం రహస్యగదికి మరమ్మత్తులు చేపట్టనున్న పురావస్తు శాఖ, రహస్య గది భద్రతను అధికారులు పరిశీలించనున్నారు. మరమ్మత్తులు పూర్తయ్యాక తిరిగి రహస్యగదికి తరలించి సంపదను లెక్కకట్టనున్నారు. రహస్య గది లెక్కింపుకు 30 నుంచి 40 రోజుల సమయం పట్టవచ్చని ఒరిస్సా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ తెలిపారు.
Read Also :Viral Video : కొడుకుకు నరకం చూపిన తల్లి.. మీద కూర్చొని, తల నేలకేసి కొడుతూ..ఛాతిపై కొరుకుతూ
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!