Vijayawada: ఇంద్రకీలాద్రి కనక దుర్గ అమ్మకు తెలంగాణ బంగారు బోనం..
- అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి
- బంగారు బోనాన్ని సమర్పించే ఊరేగింపుకు హాజరు
- బోనం సమర్పించిన హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించే ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. దుర్గమ్మ వారికి హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల సభ్యులు బంగారు బోనం సమర్పించారు. 500 మంది కళాకారులు విచిత్ర వేషాలు, పోతురాజులు డప్పులు, కోలాటాలతో బ్రాహ్మణ విధి నుంచి ఘాట్ రోడ్డు మీద దుర్గమ్మ చెంతకు బంగారు బోనం చేరుకుంది.
READ MORE: Rule Change From 1st July: జూలై 1 నుంచి కొత్త రూల్స్.. ఏమేం మారనున్నాయంటే?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
దేవస్థానం నుంచి ఆంధ్రప్రదేశ్ కళారూపాలైన చిన్నారుల నెమలి నృత్యం, కరగం నృత్యం, తప్పెట్లు, కోలాటం, సంప్రదాయ భజనలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలు పాడిపంటలతో, సుఖశాంతులతో, అభివృద్ధి పథంలో దూసుకు వెళ్లాలని బంగారు బోనం సమర్పించారు. దుర్గగుడికి చేరుకున్న బంగారు బోనాన్ని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందుకున్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలు మేరకు, బోనం సమర్పించడానికి తెలంగాణ నుంచి వచ్చిన కమిటీ సభ్యులకు, భక్తులకు ఏటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ వి. కె.శీనా నాయక్ స్పష్టం చేశారు. బంగారు బోనం సమర్పణ కోసం చేసిన ఏర్పాట్లపై మంత్రి ఆనంకు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
READ MORE: Amit Shah: పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..