Ambati Rambabu: టీడీపీ కోసమే పుట్టిన పార్టీ జనసేన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ-జనసేన జేఏసీ మీటింగ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ విధానం ఏంటి అని ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్ కాబట్టే నీ విధానాన్ని తప్పు బడుతున్నామన్నారు. 2014లో కలిసి పోటీ చేశావ్… 2019లో విడిగా పోటీ చేశావ్.. ఏం చేసినా చంద్రబాబుకు ప్రయోజనం కలిగించటమే పవన్ లక్ష్యమని మంత్రి అన్నారు. చంద్రబాబుకు మనో ధైర్యాన్ని ఇవ్వటం కోసం.. లోకేష్ పల్లకి మోయటం కోసం రాజమండ్రిలో సమావేశమయ్యామన్నారు. టీడీపీ కోసమే పుట్టిన పార్టీ జనసేన అని మంత్రి అంబటి విమర్శించారు. చంద్రబాబుకు తాము బెయిల్ రాకుండా చేస్తున్నామా అని మండిపడ్డారు.
Harish Rao: ఈ దసరా లోపు సిద్దిపేటకి రైలు తెచ్చి దశాబ్దాల కల నిజం చేసుకున్నాం
Also Read
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
- మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
పవన్ కళ్యాణ్ కు వ్యవస్థ పై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. కేసు స్ట్రాంగ్ గా ఉండటం వల్లే ఏ కోర్టులోనూ రిలీఫ్ దొరకటం లేదని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తారని మొదటి రోజు నుంచే చెబుతున్నామని.. తాము చెప్పిందే జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంది పై కేసులు పెట్టినా బాధ అనిపించ లేదా అని ప్రశ్నించారు. పవన్ కు సొంత ఆలోచనా విధానమే లేదని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మూడేళ్ళ కిందటే చంద్రబాబు పల్లకిని పవన్ కళ్యాణ్ మోస్తాడని చెప్పామని.. అమిత్ షా పిలిస్తేనే వెళ్ళానని లోకేష్ చెప్పాడన్నారు. ఇవాళ కిషన్ రెడ్డి వాస్తవాలు బయటపెట్టారని, పదే పదే అభ్యర్థిస్తేనే లోకేష్ కు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు అని కిషన్ రెడ్డి వెల్లడించారని మంత్రి పేర్కొన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో పురంధరేశ్వరి, లోకేష్ మాటల్లోని డొల్లతనం బయటపడిందని మంత్రి అన్నారు.
Nara Lokesh: అభివృద్ధితో సంక్షేమం మా కూటమి నినాదం
ఎంత మంది కలిసినా జగన్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని మంత్రి అంబటి అన్నారు. వారి మ్యానిఫెస్టో రాష్ట్రాన్ని కాపాడే విధంగా ఉంటుందో, టీడీపీని కాపాడే విధంగా ఉంటుందో చూద్దామన్నారు. జైల్లో ఉండే ప్రతి వాడు ప్రజల గుండెల్లో ఉండరని తెలిపారు. టీడీపీనే రాష్ట్రానికి పట్టిన తెగులు అని విమర్శించారు. బయటకు వస్తే సాక్ష్యాధారాలు బయటపడతాయనే చంద్రబాబును రిమాండ్ లో ఉంచారని మంత్రి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ద్వారా ఓటు కొనాలని ప్రయత్నించి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన విషయం అందరికి తెలిసిందే కదా అని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం కోసమే 17ఏ మీద పోరాడుతున్నాడని.. చంద్రబాబు దొరికిన దొంగ అని విమర్శించారు. చంద్రబాబు లోపల ఊసలు లెక్క పెట్టుకోవటం, బయట లోకేష్ రోజులు లెక్క పెట్టుకోక తప్పదని మంత్రి అంబటి తెలిపారు.
తాజావార్తలు
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!