Nara Lokesh: అభివృద్ధితో సంక్షేమం మా కూటమి నినాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశం అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో పవన్ చంద్రబాబుకు మద్దతిచ్చారని.. గెలిచామన్నారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ టీడీపీకి మద్దతిచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను వైసీపీ ప్రభుత్వం వేధించిందని లోకేశ్ పేర్కొన్నారు. కరవు.. జగన్ కవల పిల్లలు అని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని ఆరోపించారు.
Ram Charan: సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వారితో కలిసి రామ్చరణ్ దంపతుల దసరా
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఈ ప్రభుత్వ హయాంలో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రకరకాల పన్నులతో, విద్యుత్ భారాలతో ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతోంటే కేసులు పెడుతున్నారని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వేధిస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి.. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని లోకేశ్ అన్నారు. పవన్ కల్యాణ్ విజయవాడకు వస్తోంటే పోలీసులు ఆపేశారని తెలిపారు. ప్రజల తరపున పోరాడేందుకు జేఏసీ తొలి సమావేశం నిర్వహించామని.. ఈ నెలాఖరులో మూడు రోజుల పాటు ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై పోరాడతామని నారా లోకేశ్ అన్నారు. కరవుతో ఇబ్బంది పడుతోన్న రైతులను ఉమ్మడిగా పరామర్శిస్తాం.. పొలాలను పరిశీలిస్తామని తెలిపారు.
Devara: బావుంది సర్.. ఎన్టీఆర్ కూడా ఉంటే ఇంకా బావుండేది
ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామని లోకేశ్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ ఖండన, రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు, అన్ని వర్గాల సమగ్రాభివృద్ధిపై తీర్మానాలు చేపట్టామన్నారు. ప్రజల సమస్యలపైనా, రాష్ట్రాభివృద్ధి పైనా చర్చించామని లోకేశ్ తెలిపారు. తమ మధ్య గొడవలు రావు.. మేం కొట్టుకోమన్నారు. వైసీపీ వాళ్లు కొట్టుకుంటారేమోనని లోకేశ్ అన్నారు. జనసేన ఎన్డీఏ పార్టనర్ అని.. ఏపీ ప్రయోజనాలే జనసేన ప్రయార్టీ అని తెలిపారు. ఈ నెల 27వ తేదీ తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టు రానుందని లోకేశ్ చెప్పారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగ్గకుండా ఉమ్మడిగా పని చేస్తామన్నారు. అభివృద్ధి-సంక్షేమం ఈ కూటమికి జోడెద్దుల బండి అని లోకేశ్ అన్నారు. అప్పులతో సంక్షేమం కాదు.. అభివృద్ధితో సంక్షేమం మా కూటమి నినాదమని లోకేశ్ చెప్పారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!