Ambati Rambabu: చంద్రబాబు ఆరోగ్యం గురించి డాక్టర్లు చెప్పాలి.. టీడీపీ నాయకులు కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదని టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మధు ఖోడా, సిబు సోరేన్, జయలలిత, లాలు ప్రసాద్ యాదవ్ లాంటి మాజీ ముఖ్యమంత్రులు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసింది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు విషయంలో కూడా అంతే.. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసింది.. ఎవరి మీద కక్ష్య సాధించాలి అన్న ఉద్దేశ్యం వైసీపీ ప్రభుత్వానికి లేదు అని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ పై అవాకులు చవాకులు పేలుతున్న నాయకులు అది గుర్తు పెట్టుకోవాలి.. పురంధేశ్వరి ఏ పార్టీ అధ్యక్షురా లో తెలియాలి.. ఎన్టీఆర్ కుమార్తెకు అధికారం ఉన్న పార్టీలలో చొరబడడం, చంద్రబాబును కాపాడటం అలవాటు అయిపొయింది అంటూ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
Read Also: BRS Manifesto Live updates: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. లైవ్ అప్డేట్స్
Also Read
అమిత్ షాకు చెప్పుకున్న స్పందన లేదు.. నిజాలు తెలుసుకునే కేంద్రం మౌనంగా ఉండిపోయింది అంటూ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం టీడీపీ నాయకులు నారా లోకేశ్, భువనేశ్వరి చేస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ముందు నుండే చర్మ సంబంధ వ్యాధి ఉంది.. రాజకీయ లబ్ది పొందటానికి అనారోగ్యం ప్రచారం జరుగుతుంది.. చంద్రబాబు ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే ముందే ఏసీ అడాగాలి కదా అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Jagtial: బహుమతులుగా గొర్రె పొట్టేలు, మందుబాటిల్.. ఓ షాపు యజమాని వినూత్నంగా ఆఫర్..
జుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు కోర్టు అనేక సదుపాయాలు ఇచ్చింది అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రత్యేక ఆహారం, మందులు తీసుకునే అవకాశం ఇచ్చారు.. 17a ప్రకారం చంద్రబాబుపై కేసు కొట్టేయాలని చేసిన డిమాండ్ ను కోర్టులు తిరస్కరించాయి.. తప్పు చేశాడు కాబట్టి, సాక్ష్యాలను తారు మారు చేస్తాడనే ఉద్దేశంతో కోర్టులు ఇప్పటి వరకు చంద్రబాబుకు బెయిల్ కూడా ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం విషమం అని కొత్త ప్రచారాలు చేస్తున్నారు.. చంద్రబాబు ఇంటి నుంచి వచ్చే ఆహారంలో స్టెరాయిడ్స్ ఎవరు కలిపి ఇస్తున్నారు చెప్పాలి అని డిమాండ్ చేశారు.
Read Also: Minister MallaReddy: మా మ్యానిఫెస్టో అద్భుతంగా ఉంటుంది.. కేసీఆర్ పులి.. ఎవరికి భయపడే వ్యక్తి కాదు..
చంద్రబాబు ఆరోగ్యంపై డాక్టర్ లు చెప్పాలి.. టీడీపీ నాయకులు కాదు అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్టీఆర్ ను వెన్ను పోటు పొడిచిన యనమల, చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. జైలుకు వెళ్లిన తర్వాత చంద్రబాబు బరువు తగ్గ లేదు.. కిలో బరువు పెరిగాడు.. జ్యుడిషియల్ రిమాండ్ కస్టడీ లో ఉన్న చంద్రబాబుకు కోర్టు ఆదేశాల ప్రకారం మాత్రమే సౌకర్యాలు ఉంటాయి.. జైలు అధికారులు నిబంధనల ప్రకారమే నడుచుకుంటారు.. చంద్రబాబు ఏసీ అడిగిన గంటలో కోర్టు అనుమతించింది.. చంద్రబాబును హాస్పిటల్ కు తరలించాలంటే ఆ నిర్ణయం కూడా కోర్టు తీసుకుంటుంది.. చంద్రబాబు ఖరీదైన లాయర్లను పెట్టుకున్నా.. బెయిల్ ఎందుకు రావడం లేదో టీడీపీ కార్యకర్తలు ఆలోచించాలని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!