Mini Medaram Jatara: సిద్దిపేట మినీ మేడారం జాతర.. 12 గ్రామాల్లో సంబరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mini Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు సిద్దిపేట జిల్లాలో నిర్వహించే మినీ మేడారం జాతరలకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కోసం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో సమ్మక్క ఆలయాన్ని ప్రతిష్ఠించారు. మేడారం తరహాలో ఈ జాతర కూడా 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. మొదటిరోజు సారలమ్మ, రెండోరోజు సమ్మక్కను ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సాయంత్రం అమ్మవార్ల ఊరేగింపు ఉంటుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ వేడుకల్లో భాగంగా గురు, శుక్రవారాల్లో రాత్రి వేళల్లో కథల కార్యక్రమం నిర్వహిస్తారు.
Read also: CM Revanth Reddy: మిషన్ భగీరథపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష
Also Read
- Fuel Prices: తగ్గిన LPG ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..
- Ruchika Singh: "నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి".. ప్రధానిని దూషించిన విద్యార్థిని వీడియో విడుదల
- Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
అక్కెనపల్లి మినీ మేడారం జాతర..
నేటి నుంచి 23వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను తిలకించేందుకు ఏర్పాట్లు చేయడంతో అక్కెనపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం సారలమ్మను, గురువారం సమ్మక్కను గద్దెకు తీసుకురానున్నారు. ఈ జాతరలో భాగంగా శుక్రవారం భక్తులు కానుకలు చెల్లించి పూజలు నిర్వహించనున్నారు. శనివారం అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఉత్సవాల్లో భాగంగా రాత్రి కథ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Read also: IPL 2024 Schedule: నేడు ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్!
కథనం ఇలా..
నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామ శివారులోని పులిగుండ్ల సమీపంలో ఓ గొర్రెల కాపరి 40 ఏళ్ల కిందటే మేకలను మేపుతుండగా పెద్ద బట్టతల ప్రాంతంలో పసుపు, కుంకుమ ముద్దలు కనిపించాయి. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో గ్రామస్తులంతా తండోపతండాలుగా అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతరకు కొద్దిరోజుల ముందు ఈ ప్రాంతంలో పసుపు, కుంకుమ బొట్లు దర్శనమిచ్చాయని పూనకం వచ్చిన ఓ మహిళ తెలిపారు. ఆమె మాటలతో గ్రామస్తులు నమ్మారు. సమ్మక్క తల్లి పులిపై స్వారీ చేస్తుందని, అందుకే గ్రామంలోని పులి గుట్టల వద్ద పసుపు రంగులో దర్శనమిస్తుందని గ్రామస్తుల నమ్మకం. దీంతో గ్రామంలో ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఆ సమయంలో పులిగుండ్ల సమీపంలో తలో 14 ఎకరాల భూమిని సేకరించి 1984లో సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వారి కోడలు లక్ష్మి, పగిద్దరాజు (నాగుపాము) విగ్రహాలను ప్రతిష్ఠించారు.అప్పటి నుంచి ప్రతి రోజు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మేడారంలో రెండేళ్లు సమ్మక్క, సారలమ్మలు ఉసిరికాయలు వేసి, భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
Virat Kohli-Akay: విరాట్ కోహ్లీ, అకాయ్ ఫోటోలు చూశారా?.. నాన్న మ్యాచ్ ఆడుతుంటే..!
తాజావార్తలు
-
MG Hector Plus Diesel: ఎంజీ హెక్టర్ కొత్త డీజిల్ వేరియంట్ విడుదల.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే
-
Fuel Prices: తగ్గిన LPG ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..
-
Ruchika Singh: “నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”.. ప్రధానిని దూషించిన విద్యార్థిని వీడియో విడుదల
-
Fauzi: ప్రభాస్కు తల్లిగా అలనాటి అందాల తార.. ‘ఫౌజీ’లో ఒకప్పటి స్టార్ హీరోయిన్!
-
Preethizinta : ఎనిమిదేళ్ల విరామం తర్వాత బిగ్ స్క్రీన్పై ప్రీతి జింటా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!