Myanmar : మయన్మార్లోని ఒక గ్రామంపై బాంబు దాడి.. పిల్లలతో సహా 17మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Myanmar : మయన్మార్లోని వాయువ్య ప్రాంతంలోని ఒక గ్రామంపై సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో తొమ్మిది మంది చిన్నారులు సహా కనీసం 17 మంది పౌరులు మరణించారు. మానవ హక్కుల సంఘం ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. భారత సరిహద్దుకు దక్షిణంగా ఉన్న సగయింగ్ ప్రాంతంలోని కనన్ గ్రామంలో ఉదయం జరిగిన వైమానిక దాడిలో దాదాపు 20 మంది గాయపడ్డారని చెప్పారు. ఫిబ్రవరి 2021లో ప్రజాస్వామ్య అనుకూల నేత ఆంగ్ సాన్ సూకీ ఎన్నికైన ప్రభుత్వాన్ని సైన్యం తొలగించింది.
Read Also:Teja Sajja : నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఏకలవ్య శిష్యుడిని..
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
గతేడాది ఏప్రిల్లో మయన్మార్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో 100 మందికి పైగా మరణించారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీరు వెళ్లినట్లు సమాచారం. మయన్మార్ వైమానిక దాడులను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ కూడా ఖండించారు. వోల్కర్ టర్క్ మాట్లాడుతూ.. పౌరులపై దాడులకు సంబంధించిన నివేదికలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు.
Read Also:HanuMan Movie Team :హనుమాన్ టీం సంచలన ప్రకటన.. తెగే ప్రతి టికెట్లో 5 రూపాయలు రాముడికే..
ఫిబ్రవరి 2021లో మయన్మార్ సైన్యం దేశంలో తిరుగుబాటు చేసింది. ఆ తర్వాత అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులపై సైన్యం చర్యలు తీసుకుంటోంది. తిరుగుబాటు తర్వాత మూడు వేల మందికి పైగా పౌరులు మరణించారు. వైమానిక దాడిలో నేషనల్ యూనిటీ గవర్నమెంట్ (ఎన్యుజి) కార్యాలయం కూడా ధ్వంసమైంది. దాడి సమయంలో మహిళలు, పిల్లలు సహా 150 మందికి పైగా ప్రజలు వేదిక వద్ద ఉన్నారు. వారిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మిలటరీ పాలన వ్యతిరేక సాయుధ గ్రూపులు, ఇతర రాజకీయ సంస్థల నేతలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!