Ponnam Prabhakar : హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి భయం అవసరం లేదు
- ఆపరేషన్ సింధూర్ పై స్పందించిన మంత్రి పొన్నం
- సాయుధ దళాల విజయంపై ప్రశంసల జల్లు
- దేశ సరిహద్దుల్లో సైన్యం చూపిన ధైర్యాన్ని చూసి గర్విస్తున్నాం : మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా గర్వభావాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. “జై హింద్!” అంటూ ప్రారంభించిన ఆయన ప్రకటనలో, సాయుధ దళాల విజయంపై ప్రశంసల జల్లు కురిపించారు. దేశ సరిహద్దుల్లో సైన్యం చూపిన ధైర్యాన్ని చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి భయం అవసరం లేదని, నగరంలోని పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని మంత్రి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల భద్రత చర్యలు చేపడుతోందని వెల్లడించారు.
Star Hero : ఓ వైపు ప్లాపులు.. అయినా సరే భారీ రెమ్యునరేషన్
Also Read
- YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏదైనా కనిపించినా, వెంటనే సమీప పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలి” అని కోరారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, కంచన్ బాగ్, నానాల్నగర్ ప్రాంతాల్లో మాక్ డ్రిల్లులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాతాళ్ళలో కంటోన్మెంట్ ఏరియాల ద్వారా నగరాన్ని రక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భారతదేశం అంతర్భాగంలో కానీ, సరిహద్దుల్లో కానీ మనం ఎప్పుడూ గెలవాలని, ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని, ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే భద్రతా చర్యలకు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అంతర్గత భద్రత విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ తీర్మానించినట్లు తెలిపారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. చివరగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఏదైనా కనిపించినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..