కొత్త ఏడాదిలో వినియోగదారులకు Mercedes-Benz షాకింగ్ న్యూస్.. మరింత పెరగనున్న కార్ల ధరలు
- కొత్త ఏడాదిలో వినియోగదారులకు Mercedes-Benz షాకింగ్ న్యూస్..
- 2026 జనవరి 1 నుంచి అన్ని మోడళ్లపై 2% వరకు ధరల పెరుగుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mercedes-Benz: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) 2 శాతం వరకు ధరల పెంపును ప్రకటించింది. ఈ కొత్త ధరలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. లగ్జరీ ఆటోమొబైల్ మార్కెట్పై ప్రభావం చూపుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్ అస్థిరత, ముడిసరుకు ధరల పెరుగుదల, లాజిస్టిక్స్ సమస్యలు కారణంగా ఆపరేషనల్ ఖర్చులు భారీగా పెరిగినట్లు మెర్సిడెస్-బెంజ్ సంస్థ స్పష్టం చేసింది. వీటన్నింటి ప్రభావంతో ధరలను స్వల్పంగా సవరించాల్సి వచ్చిందని తెలిపింది.
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
ఇక మెర్సిడెస్-బెంజ్ ఇండియా ప్రకారం.. 2025 మొత్తంలో యూరో, రూపాయి మారకం విలువ రూ. 100కు పైగానే కొనసాగింది. ఇది గత సగటు స్థాయిలతో పోలిస్తే ఎక్కువ. దీని వల్ల లోకల్ అస్సెంబెలింగ్ కోసం దిగుమతి చేసే భాగాలు, అలాగే పూర్తిగా దిగుమతి చేసుకునే కార్లు (CBUs) ఖర్చులు పెరిగాయి. ఫలితంగా కంపెనీ మొత్తం కార్యకలాప వ్యయం ఎక్కువైంది. లోకలైజేషన్ వ్యూహం ద్వారా ఈ ఖర్చులలో చాలా భాగాన్ని సంస్థ భరించినప్పటికీ, వ్యాపార స్థిరత్వం కోసం పరిమిత స్థాయిలో ధరల సవరణ అవసరమైందని కంపెనీ పేర్కొంది.
John Cena: రిటైర్మెంట్ మ్యాచ్లో ఓడిపోయిన జాన్సీనా.. ఓడించింది ఇతనే!
ఈ విషయంపై మెర్సిడెస్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో మాట్లాడుతూ.. ఈ ఏడాది మేము ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కరెన్సీ ఒత్తిళ్లు కొనసాగాయి. యూరో విలువ నిరంతరం 100కు పైగా ఉండటం వల్ల దిగుమతి భాగాలు, పూర్తిగా దిగుమతి కార్లు సహా మా కార్యకలాపాలన్నింటిపై ప్రభావం పడింది. అంతేకాదు ముడిసరుకు ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా మొత్తం ఆపరేషనల్ ఖర్చులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. అదే సమయంలో ఆర్బీఐ రెపో రేటు తగ్గింపులు మెర్సిడెస్-బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా కస్టమర్లకు ప్రయోజనంగా మారాయని, దీని వల్ల ధరల పెంపు ప్రభావం కొంత మేర తగ్గిందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!