Mercedes-Benz: సింగిల్ ఛార్జింగ్పై 949 కిమీ.. గిన్నిస్ రికార్డుల్లో ‘మెర్సిడెస్ బెంజ్’!
- గిన్నిస్ రికార్డుల్లో మెర్సిడెస్ బెంజ్
- ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ రికార్డు బద్దలు
- బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mercedes-Benz EQS 580 Guinness Record: జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ‘మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మేటిక్’ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్ (బీఈవీ) గిన్నిస్ రికార్డును నమోదు చేసింది. ఈ కారు సింగిల్ ఛార్జింగ్పై బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు 949 కిమీ ప్రయాణించడంతో ఈ రికార్డు సొంతం చేసుకుంది. సింగిల్ చార్జ్తో ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించిన బీఈవీ ఇదేనని గిన్నిస్ బుక్ వర్గాలు తేల్చాయి.
మార్గ మధ్యంలో వాహన రద్దీ, రహదారి పనులు, దారి మళ్లింపులు, భారీ వర్షాలు ఉన్నా.. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మేటిక్ ఈ రికార్డు సాధించడం విశేషం. బెంగళూరు నుంచి దావణగెరె, హుబ్లీ, బెళగావి, కొల్హాపుర్, సతారా, పుణె మీదుగా ప్రయాణించి నవీ ముంబైకి చేరింది. ప్రతి 100 కిమీ దూరానికి 11.36 కిలోవాట్ అవర్ విద్యుత్ పవర్ను ఈ కారు వినియోగించుకుంది. ‘ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ ఈ’ కారు నెలకొల్పిన రికార్డును మెర్సిడెస్ బెంజ్ బద్దలు కొట్టింది. యూకేలో ఆ కారు సింగిల్ ఛార్జింగ్పై 916.74 కిమీ ప్రయాణించింది.
Also Read
- OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
- OTR: రాఖీతో పొలిటికల్ బంధం బలపడుతుందా..
- Ram Mohan Naidu: 'పీ4' విధానంలో శ్రీకాకుళం జిల్లాకు 'ఎ' గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
Also Read: Ganesh Chaturthi 2024: ఆ గ్రామంలో ‘ఒక్కడే’ వినాయకుడు.. 40 ఏళ్లుగా ఆనవాయితీ! కారణం ఏంటంటే
‘మేడ్ ఇన్ ఇండియా’ ఈక్యూఎస్ కారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ను గెల్చుకోవడం పట్ల మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రికార్డును సాధించడానికి కారణమైన ఆటోకార్ ఇండియా బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న చకాన్ ప్లాంట్లో ఈ కార్లు తయారవుతున్నాయి. హైదరాబాద్లో ఈ కారు ధర రూ.1.95 కోట్లుగా ఉంది.
తాజావార్తలు
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
-
OTR: రాఖీతో పొలిటికల్ బంధం బలపడుతుందా..
-
TGIIC : రాయదుర్గం భూములకు జాక్పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!