Mercedes-Benz: సింగిల్ ఛార్జింగ్పై 949 కిమీ.. గిన్నిస్ రికార్డుల్లో ‘మెర్సిడెస్ బెంజ్’!
- గిన్నిస్ రికార్డుల్లో మెర్సిడెస్ బెంజ్
- ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ రికార్డు బద్దలు
- బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mercedes-Benz EQS 580 Guinness Record: జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ‘మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మేటిక్’ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్ (బీఈవీ) గిన్నిస్ రికార్డును నమోదు చేసింది. ఈ కారు సింగిల్ ఛార్జింగ్పై బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు 949 కిమీ ప్రయాణించడంతో ఈ రికార్డు సొంతం చేసుకుంది. సింగిల్ చార్జ్తో ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించిన బీఈవీ ఇదేనని గిన్నిస్ బుక్ వర్గాలు తేల్చాయి.
మార్గ మధ్యంలో వాహన రద్దీ, రహదారి పనులు, దారి మళ్లింపులు, భారీ వర్షాలు ఉన్నా.. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మేటిక్ ఈ రికార్డు సాధించడం విశేషం. బెంగళూరు నుంచి దావణగెరె, హుబ్లీ, బెళగావి, కొల్హాపుర్, సతారా, పుణె మీదుగా ప్రయాణించి నవీ ముంబైకి చేరింది. ప్రతి 100 కిమీ దూరానికి 11.36 కిలోవాట్ అవర్ విద్యుత్ పవర్ను ఈ కారు వినియోగించుకుంది. ‘ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ ఈ’ కారు నెలకొల్పిన రికార్డును మెర్సిడెస్ బెంజ్ బద్దలు కొట్టింది. యూకేలో ఆ కారు సింగిల్ ఛార్జింగ్పై 916.74 కిమీ ప్రయాణించింది.
Also Read
Also Read: Ganesh Chaturthi 2024: ఆ గ్రామంలో ‘ఒక్కడే’ వినాయకుడు.. 40 ఏళ్లుగా ఆనవాయితీ! కారణం ఏంటంటే
‘మేడ్ ఇన్ ఇండియా’ ఈక్యూఎస్ కారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ను గెల్చుకోవడం పట్ల మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రికార్డును సాధించడానికి కారణమైన ఆటోకార్ ఇండియా బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న చకాన్ ప్లాంట్లో ఈ కార్లు తయారవుతున్నాయి. హైదరాబాద్లో ఈ కారు ధర రూ.1.95 కోట్లుగా ఉంది.
తాజావార్తలు
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!