Mekapati Chandrasekhar Reddy: నేను వెంకటరమణకే ఓటేశా.. అవన్నీ తప్పుడు ఆరోపణలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. నేను పార్టీ చెప్పిన ప్రకారం జయమంగళ వెంకట రమణకే ఓటు వేశాను ఆయన గెలిచారు…నన్ను ఎవరూ అనటానికి లేదు. నేను పార్టీకి చేసిన ఓటు వేసిన తర్వాత నేను ముఖ్యమంత్రి జగన్ ని కలిసి వచ్చాను. ఎమ్మెల్యే పదవినే తృణప్రాయంగా వదిలి వచ్చిన వాడిని. టికెట్ ఇస్తే పోటీ చేస్తా…లేదంటే లేదు. నియోజకవర్గంలో నేను ఏంటో చూపిస్తాను. జగన్ కూడా టికెట్ విషయంలో నాకు సానుకూలంగా లేరు అన్నారు చంద్రశేఖర్ రెడ్డి.
Read Also: Amritpal Singh: డెహ్రాడూన్, హరిద్వార్ హై అలర్ట్.. నేపాల్కు పారిపోయేందుకు ప్లాన్..
Also Read
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
ఎవరో నా మీద తప్పుడు సమాచారం ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఇదంతా మా పార్టీ నేతలే చేస్తున్నారు అన్నారు చంద్రశేఖర్ రెడ్డి. అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరుకు వెళ్ళినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధకే ఓటేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మరి టీడీపీ అభ్యర్థికి ఓటేసింది ఎవరనేది తేలాల్చి ఉంది.
Read Also:Naresh Pavitra Lokesh: ఓరీవారి… మళ్లీ పెళ్లి అనేది సినిమానా?
వైసీపీ నేతలు మాత్రం పార్టీకి ద్రోహం చేసినవారి భరతం పడతామంటున్నారు. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాట్ కామెంట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వల్లభనేని మాట్లాడుతూ.. మా మాజీ బాస్ డబ్బులు చూపి కొనుగోలు చేయడంలో ఎక్స్ పర్ట్..డబ్బులు ఎర చూపి నలుగురిని కొనుగోలు చేసినట్లు తెలిసింది..అందువలనే టిడిపి గెలిచింది.. ఆ నలుగురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు రావనే చంద్రబాబుతో బేరం కుదుర్చుకున్నారు..దీంతో ఇద్దరికి మేలు జరిగింది.. చంద్రబాబు కు ఓటు వచ్చింది, వీరికి క్యాష్ వచ్చింది. మొన్న తెలంగాణలో అధికారంలోకి వస్తాం అని టిడిపి అంది ఇప్పుడు ఎపిలో 175 గెలుస్తామని చెబుతుంది, జరిగేవి చెప్పాలన్నారు వంశీ.
తాజావార్తలు
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!