పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్’. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. చిన్న షెడ్యూల్ లో కీలకమైన సీన్స్ షూట్ చేసాడు. ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ లో రెబల్ స్టార్ త్వరలో ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు.
Also Read : The Raja Saab : థియేటర్ రన్ ముగించిన రాజాసాబ్.. ఫైనల్ గా నష్టం ఎంత?
కాగా ఈ సినిమాకు సంబందించి ఓ న్యూస్ టాలీవుడ్ హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి “స్పిరిట్” సినిమాలో నటించబోతున్నాడట. యంగ్ రెబల్ స్టార్ కు తండ్రిగా సినిమా సెకండాఫ్ లో దాదాపు 15 నిమిషాల పాటు కనిపించబోతున్నాడట. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి కలయిక పెద్ద సంచలనం అనే చెప్పాలి. ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా మెగాస్టార్ చేతులు మీదుగా జరిగాయి. అప్పటి నుండి స్పిరిట్ లో మెగాస్టార్ నటిస్తున్నాడు అని గాసిప్ లు వినిపించాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే స్పిరిట్ లో ప్రభాస్ తండ్రిగా మెగా స్టార్ నటిస్తున్నాడననేది నిజమనిపిస్తోంది. యానిమల్ లో రణబీర్ కు తండ్రిగా అనిల్ కపూర్ ను స్టయిలిష్ గా చుపించిన సందీప్ రెడ్డి ఇప్పుడు స్పిరిట్ లో మెగాస్టార్ ను ఎలా చుపిస్తాడనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో ఉంది. ఏదేమైనా మెగా స్టార్ – సూపర్ స్టార్ ఒకే ఫ్రెమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ కు వచ్చే కిక్ వేరే. మరి మెగా – సూపర్ స్టార్ కలయిక గురించి మేకర్స్ నుండి అఫీషియల్ ప్రకటన ఎప్పడూ వస్తుందో చూడాలి.