మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కెరీర్లో ఫుల్ జోష్లో ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సుమారు రూ. 300 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో, ఆయన తన తదుపరి చిత్రం ‘మెగా 158’పై దృష్టి పెట్టారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి హీరోయిన్గా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించబోతున్నారు. అలాగే చిరంజీవి కూతురిగా కృతి శెట్టి కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే,
Also Read : Dhurandhar 2 – Toxic : ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్.. సౌత్ ఆడియెన్స్ ఓటు ఎవరికో?
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ ప్రస్తుతం కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఫిలిం నగర్ టాక్. వారు నిర్మించిన ‘జన నాయగన్’ చిత్రం వివాదాల్లో చిక్కుకోవడం, మరోవైపు యశ్ ‘టాక్సిక్’ సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల.. చిరు సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. అంతే కాదు ప్రస్తుత సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కావాల్సి ఉండగా, నిర్మాణ సంస్థ చిక్కుల వల్ల షూటింగ్ షెడ్యూల్స్ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఈ ప్రాజెక్ట్ వేరే నిర్మాణ సంస్థ చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉందట. చూడాలి మరి ఏం జరుగుతుందో..?