Obc MPs Meeting: ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Obc MPs Meeting: ఢిల్లీలో జరిగిన ఓబీసీ ఎంపీల సమావేశంలో దేశంలో వెనుకబడిన వర్గాల జనాభా పెరిగిన స్థాయిలో వారికి న్యాయం జరగడం లేదని పార్లమెంట్ సభ్యులు మండిపడ్డారు. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు కేశవరావు, ఆర్ కృష్ణయ్య, గోరెంట్ల మాధవ్, బీఎస్పీ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్, జేడీయూ ఎంపీ గిరిధర్ యాదవ్, పలువురు ఎంపీలు, పీసీసీ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హాజరయ్యారు. కులగణన చేయాలి , ఓబీసీ రిజర్వేషన్లు 52శాతానికి పెంచాలి, ఓబీసీలపై విధించిన క్రిమిలేయర్ ఎత్తివేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఓబీసీల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని పలువురు ఎంపీలు సమావేశంలో మాట్లాడారు.
ఓబీసీ ఎంపీల ఫోరమ్ తరపున గత 11 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నామని ఓబీసీ పార్లమెంట్ ఎంపీల ఫోరమ్ కన్వీనర్ వి.హనుమంతరావు అన్నారు. ఐఐటీ, ఐఐఎంలో రిజర్వేషన్లు అమలు చేసేలా కృషి చేశామన్నారు. ఓబీసీ పార్లమెంట్ కమిటీ కూడా ఏర్పడిందన్నారు. ఈరోజు నిర్వహించిన ఓబీసీ ఎంపీల సమావేశానికి ఎంపీలందరు మద్దతు తెలిపారని ఆయన వెల్లడించారు. కులాల వారీగా జన గణన చేపట్టాలని తాను చాలా సార్లు డిమాండ్ చేశానని, కులగణన చేపడతామని 2008లో హోంమంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చినా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదని విమర్శించారు.
Also Read
Gangster Chhota Rajan: 1999 హత్య కేసులో అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ విడుదల
డబ్బు ఖర్చవుతుందని కుల గణన ఆపడం న్యాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీమిలేయర్ను ఎత్తివేయాలని, కేంద్రప్రభుత్వంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని.. న్యాయవ్యవస్థలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అందరిని కలుపుకుని ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. కులాల వారీగా జన గణన చేపట్టాలని తాను చాలా సార్లు డిమాండ్ చేశానని, కులగణన చేపడతామని 2008లో హోంమంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చినా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. డబ్బు ఖర్చవుతుందని కుల గణన ఆపడం న్యాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీమిలేయర్ను ఎత్తివేయాలని, కేంద్రప్రభుత్వంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!