Medipally Murder Update: మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు.. పక్కా ప్రణాలికతోనే..!
- బాలాజీ హిల్స్లో ఐదు నెలల గర్భవతి హత్య
- ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి, మహేందర్
- గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం
- హత్య కేసులో సంచలన విషయాలు
మేడిపల్లి పరిధిలోని బాలాజీ హిల్స్లో జరిగిన దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదు నెలల గర్భవతైన స్వాతిని చంపేందుకే.. ఆమె భర్త మహేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిపై మహేందర్కు అనుమానం ఉంది. స్వాతి గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం పెంచుకున్నాడు. రెండు నెలల క్రితమే స్వాతిని వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చాడు. శనివారం తానుంటున్న ఇంట్లో ఓనర్స్ లేకపోవడంతో.. హత్యకు ప్లాన్ చేశాడు. అనుమానం నేపథ్యంలోనే స్వాతిని కిరాతకంగా చంపేశాడు.
స్వాతిని చంపేసిన అనంతరం ఆమె శరీర భాగాలని మహేందర్ ముక్కలుగా చేశాడు. గర్భవతి అయిన స్వాతి మృతదేహాన్ని రంపంతో కోశాడు. కాళ్లు, చేతులు, తల భాగాలను విడివిడిగా చేశాడు. పొట్ట భాగాన్ని మాత్రం కట్ చేయకుండా ఉంచాడు. కాళ్లు, చేతులు, తల భాగాలను మహేందర్ తన బండిపై తీసుకెళ్లి మూసీలో పడేశాడు. భార్యను చంపి మృతి దేహాన్ని పడవేసి తర్వాత మహేందర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మహేందర్ చెప్పిన విషయాలను పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. మూసీలో పడవేసిన మృతదేహాల భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్వాతి మృతదేహాల భాగాలు ఇంకా లభించలేదు.
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
Also Read: CM Revath Reddy: త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పా.. ఇలా కలుస్తాననుకోలేదు!
భార్యపై అనుమానం, కుటుంబ కలహాల నేపథ్యంలో స్వాతిని మహేందర్ హత్య చేశాడు. భార్యను హత్య చేసేందుకు ముందుగానే ఆక్సా బ్లేడ్ కొనుగోలు చేశాడు. భార్య స్వాతిని గొంతు పిసికి హత్య చేశాడు. భార్యను హత్య చేసిన అనంతరం మహేందర్ మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఆక్సా బ్లేడ్తో భార్య మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు. రెండు చేతులు ఓ సంచిలో.. కాళ్లు, తలని మరొక సంచిలో వేసి మూట కట్టాడు. రెండు మూటల్ని తీసుకువెళ్లి పర్వతాపూర్ మోసీలో పడేశాడు. మృతదేహాల మూటలను పడవేసిన తర్వాత మహేందర్ తన బావకు ఫోన్ చేసి చెప్పాడు. బావ సూచన మేరకు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
-
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?