Medipally Murder Update: మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు.. పక్కా ప్రణాలికతోనే..!
- బాలాజీ హిల్స్లో ఐదు నెలల గర్భవతి హత్య
- ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి, మహేందర్
- గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం
- హత్య కేసులో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడిపల్లి పరిధిలోని బాలాజీ హిల్స్లో జరిగిన దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదు నెలల గర్భవతైన స్వాతిని చంపేందుకే.. ఆమె భర్త మహేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిపై మహేందర్కు అనుమానం ఉంది. స్వాతి గర్భవతి అయినప్పటి నుంచి అనుమానం పెంచుకున్నాడు. రెండు నెలల క్రితమే స్వాతిని వికారాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చాడు. శనివారం తానుంటున్న ఇంట్లో ఓనర్స్ లేకపోవడంతో.. హత్యకు ప్లాన్ చేశాడు. అనుమానం నేపథ్యంలోనే స్వాతిని కిరాతకంగా చంపేశాడు.
స్వాతిని చంపేసిన అనంతరం ఆమె శరీర భాగాలని మహేందర్ ముక్కలుగా చేశాడు. గర్భవతి అయిన స్వాతి మృతదేహాన్ని రంపంతో కోశాడు. కాళ్లు, చేతులు, తల భాగాలను విడివిడిగా చేశాడు. పొట్ట భాగాన్ని మాత్రం కట్ చేయకుండా ఉంచాడు. కాళ్లు, చేతులు, తల భాగాలను మహేందర్ తన బండిపై తీసుకెళ్లి మూసీలో పడేశాడు. భార్యను చంపి మృతి దేహాన్ని పడవేసి తర్వాత మహేందర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మహేందర్ చెప్పిన విషయాలను పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. మూసీలో పడవేసిన మృతదేహాల భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్వాతి మృతదేహాల భాగాలు ఇంకా లభించలేదు.
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
Also Read: CM Revath Reddy: త్వరలోనే ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పా.. ఇలా కలుస్తాననుకోలేదు!
భార్యపై అనుమానం, కుటుంబ కలహాల నేపథ్యంలో స్వాతిని మహేందర్ హత్య చేశాడు. భార్యను హత్య చేసేందుకు ముందుగానే ఆక్సా బ్లేడ్ కొనుగోలు చేశాడు. భార్య స్వాతిని గొంతు పిసికి హత్య చేశాడు. భార్యను హత్య చేసిన అనంతరం మహేందర్ మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఆక్సా బ్లేడ్తో భార్య మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు. రెండు చేతులు ఓ సంచిలో.. కాళ్లు, తలని మరొక సంచిలో వేసి మూట కట్టాడు. రెండు మూటల్ని తీసుకువెళ్లి పర్వతాపూర్ మోసీలో పడేశాడు. మృతదేహాల మూటలను పడవేసిన తర్వాత మహేందర్ తన బావకు ఫోన్ చేసి చెప్పాడు. బావ సూచన మేరకు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!