Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Medical College Privatization Is A Big Scam Ys Jagan Warns Govt Vows To Complete Projects After Returning To Power

YS Jagan: ఖర్చు చేయకపోతే మెడికల్‌ కాలేజీలను అలానే వదిలేయండి.. అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తా!

Published Date :December 18, 2025 , 6:29 pm
By Sampath Kumar
  • మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పెద్ద స్కామ్
  • ఖర్చు చేయకపోతే మెడికల్‌ కాలేజీలను అలానే వదిలేయండి
  • సీఎం చంద్రబాబు కొత్త స్కామ్‌లు సృష్టిస్తున్నారు
  • ఒక్కరోజు యోగా కార్యక్రమానికి రూ.300 కోట్లు ఖర్చు చేశారు
YS Jagan: ఖర్చు చేయకపోతే మెడికల్‌ కాలేజీలను అలానే వదిలేయండి.. అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పెద్ద స్కామ్ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వమే జీతం చెల్లిస్తుందని.. కానీ నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుందన్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేరా? అని ప్రభుత్వాన్ని జగన్ప్రశ్నించారు. ఖర్చు చేయకపోతే మెడికల్‌ కాలేజీలను అలానే వదిలేయండని.. తాము అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తామన్నారు. వైసీపీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందేమోనని పేదలకు నష్టం చేయడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు కొత్త స్కామ్‌లు సృష్టిస్తున్నారని, ఒక్కరోజు యోగా కార్యక్రమానికి రూ.300 కోట్లు ఖర్చు చేశారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను లోక్‌భవన్‌లో గవర్నర్‌కు వైఎస్ జగన్ అందజేశారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ… ‘పీపీపీకి వ్యతిరేకంగా కోటి నాలుగు లక్షల మంది సంతకాలు చేశారు. గవర్నర్‌ను కలిసి సీఎం చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని వివరించాం. ప్రజల ఆకాంక్షను గవర్నర్‌కి తెలియజేశాం. గవర్నర్ మంచి మనసుతో అన్ని విన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి ఉద్యమం జరగలేదు. గ్రామ స్థాయి నుంచి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన తెలియజేశారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి.. పీపీపీ వెనక్కి తీసుకోవాలి. సామాన్యులు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రైవేటు చేతుల్లోకి హాస్పిటల్స్ మొత్తం వెళ్లిపోతే నియంత్రణ ఉండదు.. ప్రజలు దోపిడీకి గురవుతారు. ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటే ప్రైవేటు హాస్పిటల్స్ కంట్రోల్లో ఉంటాయి. ప్రభుత్వం నడపడం వల్ల వైద్యం, విద్య తక్కువ రేట్లకి అందుబాటులోకి వస్తుంది. అంతా ప్రైవేటు అయితే ఇంకా సామాన్య పిల్లలు వైద్య విద్య చదవగలరా?’ అని ప్రశ్నించారు.

Also Read: CM Chandrababu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ!

‘కాలేజీలు ప్రయివేటుకు ఇవ్వడం పెద్ద స్కామ్, జీతాలు ఇవ్వడం అతిపెద్ద స్కామ్. సీఎం చంద్రబాబు స్కామ్‌లలో కొత్త స్కామ్‌లు సృష్టిస్తున్నాడు. దేశ చరిత్రలో ఇలాంటి స్కామ్ ఎక్కడా చూసి ఉండరు. వెయ్యి కోట్లు ఏడాదికి పెట్టలేరా?, పెట్టకపోతే అలా వదిలేయండి. మేము అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తాం. మాకు క్రెడిట్ వస్తుందేమో అని పేదలకు నష్టం చెయ్యడం సరికాదు. 17 మెడికల్ కాలేజీలు లక్ష కోట్ల ఆస్తి.. కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపుతాయి. రేపు కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేస్తాం. చంద్రబాబు చర్మం మందం.. ఇంత చేసినా ఆయనలో మార్పు రాకపోవచ్చు. హెరిటేజ్ కి గవర్నమెంట్ పేరు పెడితే ప్రభుత్వానిది అయిపోతుందా?. రుషికొండ విశాఖకు ఆణిముత్యంలా ఉంది. రూ.240 కోట్లు ఖర్చు చేసి బ్రహ్మాండమైన భవనాలు కట్టాం. ఎవరైనా వీఐపీలు వస్తే అందులో ఉండవచ్చు. విశాఖ మొత్తానికి తలమానికంగా ఉంది.. టూరిస్ట్ ప్లేస్ లా ఉంది. యోగా డేకి రూ.330 కోట్లు వృధా చేశారు’ అని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Chandrababu YS Jagan
  • cm chandrababu
  • Medical College Privatization
  • tdp

తాజావార్తలు

  • Shubman Gill Instagram Post Creates Stir: శుభ్‌మన్‌ గిల్ పోస్ట్‌పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్‌ ఫ్యాన్స్..

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కొలుపుకిని తింటే..

  • NTR-Neel: ఎన్టీఆర్ అలా, రుక్మిణి ఇలా.. వర్కౌట్ అవుతుందా?

  • Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి తరహా సీన్ రిపీట్.. పెళ్లికి నో చెప్పిందని యువతికి ‘ఎయిడ్స్ రక్తం’ ఇంజెక్ట్!

  • Monalisa: నా కూతురుపై ‘‘లవ్ జిహాద్’’, సీఎం గారు సాయం చేయండి.. మోనాలిసా తండ్రి కంటతడి..

ట్రెండింగ్‌

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions