YS Jagan: ఖర్చు చేయకపోతే మెడికల్ కాలేజీలను అలానే వదిలేయండి.. అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తా!
- మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పెద్ద స్కామ్
- ఖర్చు చేయకపోతే మెడికల్ కాలేజీలను అలానే వదిలేయండి
- సీఎం చంద్రబాబు కొత్త స్కామ్లు సృష్టిస్తున్నారు
- ఒక్కరోజు యోగా కార్యక్రమానికి రూ.300 కోట్లు ఖర్చు చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పెద్ద స్కామ్ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వమే జీతం చెల్లిస్తుందని.. కానీ నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుందన్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేరా? అని ప్రభుత్వాన్ని జగన్ప్రశ్నించారు. ఖర్చు చేయకపోతే మెడికల్ కాలేజీలను అలానే వదిలేయండని.. తాము అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తామన్నారు. వైసీపీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందేమోనని పేదలకు నష్టం చేయడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు కొత్త స్కామ్లు సృష్టిస్తున్నారని, ఒక్కరోజు యోగా కార్యక్రమానికి రూ.300 కోట్లు ఖర్చు చేశారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను లోక్భవన్లో గవర్నర్కు వైఎస్ జగన్ అందజేశారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ… ‘పీపీపీకి వ్యతిరేకంగా కోటి నాలుగు లక్షల మంది సంతకాలు చేశారు. గవర్నర్ను కలిసి సీఎం చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని వివరించాం. ప్రజల ఆకాంక్షను గవర్నర్కి తెలియజేశాం. గవర్నర్ మంచి మనసుతో అన్ని విన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి ఉద్యమం జరగలేదు. గ్రామ స్థాయి నుంచి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన తెలియజేశారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి.. పీపీపీ వెనక్కి తీసుకోవాలి. సామాన్యులు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రైవేటు చేతుల్లోకి హాస్పిటల్స్ మొత్తం వెళ్లిపోతే నియంత్రణ ఉండదు.. ప్రజలు దోపిడీకి గురవుతారు. ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటే ప్రైవేటు హాస్పిటల్స్ కంట్రోల్లో ఉంటాయి. ప్రభుత్వం నడపడం వల్ల వైద్యం, విద్య తక్కువ రేట్లకి అందుబాటులోకి వస్తుంది. అంతా ప్రైవేటు అయితే ఇంకా సామాన్య పిల్లలు వైద్య విద్య చదవగలరా?’ అని ప్రశ్నించారు.
Also Read
- Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
- Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
- PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
Also Read: CM Chandrababu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ!
‘కాలేజీలు ప్రయివేటుకు ఇవ్వడం పెద్ద స్కామ్, జీతాలు ఇవ్వడం అతిపెద్ద స్కామ్. సీఎం చంద్రబాబు స్కామ్లలో కొత్త స్కామ్లు సృష్టిస్తున్నాడు. దేశ చరిత్రలో ఇలాంటి స్కామ్ ఎక్కడా చూసి ఉండరు. వెయ్యి కోట్లు ఏడాదికి పెట్టలేరా?, పెట్టకపోతే అలా వదిలేయండి. మేము అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తాం. మాకు క్రెడిట్ వస్తుందేమో అని పేదలకు నష్టం చెయ్యడం సరికాదు. 17 మెడికల్ కాలేజీలు లక్ష కోట్ల ఆస్తి.. కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపుతాయి. రేపు కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేస్తాం. చంద్రబాబు చర్మం మందం.. ఇంత చేసినా ఆయనలో మార్పు రాకపోవచ్చు. హెరిటేజ్ కి గవర్నమెంట్ పేరు పెడితే ప్రభుత్వానిది అయిపోతుందా?. రుషికొండ విశాఖకు ఆణిముత్యంలా ఉంది. రూ.240 కోట్లు ఖర్చు చేసి బ్రహ్మాండమైన భవనాలు కట్టాం. ఎవరైనా వీఐపీలు వస్తే అందులో ఉండవచ్చు. విశాఖ మొత్తానికి తలమానికంగా ఉంది.. టూరిస్ట్ ప్లేస్ లా ఉంది. యోగా డేకి రూ.330 కోట్లు వృధా చేశారు’ అని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!