Mayawati: ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే అధికారంలో ఉండరు.. బీజేపీపై మాయావతి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారానికి దూరమవుతాయని మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థి జావేద్ సిమ్నానీకి మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. దీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. దేశంలో, రాష్ట్రాల్లో అధికారానికి దూరమైందన్నారు. అదే విధంగా నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే, ఓటింగ్ యంత్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉంటే బీజేపీ కూడా అధికారం కోల్పోతుందని వ్యాఖ్యానించారు.
READ MORE: CM Revanth: ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం..
Also Read
హిందుత్వ ముసుగులో మైనారిటీలపై దౌర్జన్యాలు తారాస్థాయికి చేరుకున్నాయని బీఎస్పీ చీఫ్ పేర్కొన్నారు. దీనికి తోడు పేద అగ్రవర్ణాల వారి పరిస్థితి కూడా బాగా లేదన్నారు. ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం మొత్తం రాష్ట్రంలో పెద్ద ఎత్తున వేధింపులకు గురవుతోందని తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బహుజన నాయకుల పేర్లతో ఉన్న జిల్లాల పేర్లను మార్చిందన్నారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ముస్లిం సమాజంపై దోపిడీ, అణచివేతకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వారి దోపిడీ, అణచివేతలను అరికడటామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతున్నాయని..అవినీతి ఇంకా అంతం కాలేదని చెప్పారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే యావత్ సమాజ సంక్షేమానికి భరోసా ఇస్తామని ఆమె పేర్కొన్నారు. కాగా.. ఏడో దశలో భాగంగా జూన్ 1న గోరఖ్పూర్లో ఓటింగ్ జరగనుంది.
- Tags
తాజావార్తలు
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!