Mayawati: ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే అధికారంలో ఉండరు.. బీజేపీపై మాయావతి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారానికి దూరమవుతాయని మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థి జావేద్ సిమ్నానీకి మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. దీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. దేశంలో, రాష్ట్రాల్లో అధికారానికి దూరమైందన్నారు. అదే విధంగా నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే, ఓటింగ్ యంత్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉంటే బీజేపీ కూడా అధికారం కోల్పోతుందని వ్యాఖ్యానించారు.
READ MORE: CM Revanth: ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం..
Also Read
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
హిందుత్వ ముసుగులో మైనారిటీలపై దౌర్జన్యాలు తారాస్థాయికి చేరుకున్నాయని బీఎస్పీ చీఫ్ పేర్కొన్నారు. దీనికి తోడు పేద అగ్రవర్ణాల వారి పరిస్థితి కూడా బాగా లేదన్నారు. ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం మొత్తం రాష్ట్రంలో పెద్ద ఎత్తున వేధింపులకు గురవుతోందని తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బహుజన నాయకుల పేర్లతో ఉన్న జిల్లాల పేర్లను మార్చిందన్నారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ముస్లిం సమాజంపై దోపిడీ, అణచివేతకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వారి దోపిడీ, అణచివేతలను అరికడటామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతున్నాయని..అవినీతి ఇంకా అంతం కాలేదని చెప్పారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే యావత్ సమాజ సంక్షేమానికి భరోసా ఇస్తామని ఆమె పేర్కొన్నారు. కాగా.. ఏడో దశలో భాగంగా జూన్ 1న గోరఖ్పూర్లో ఓటింగ్ జరగనుంది.
- Tags
తాజావార్తలు
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!