Mayawati Birthday: లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSP Party: బీఎస్పీ అధినేత్రి మాయావతి తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లక్నోలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ.. సమాజ్ వాదీ పార్టీతో పాటు బీజేపీని టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. తమ పార్టీ మద్దతును నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు. ఇండియా కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా పార్టీకి తక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.. అలాగే, మన ఓట్ల శాతం కూడా తగ్గుతుందన్నారు. అందుకే బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా పార్టీలు భావిస్తున్నాయి.. కానీ, లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా మా పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుంది చెప్పుకొచ్చారు. అత్యున్నత నాయకత్వం దళితుడి చేతిలో ఉన్నందున ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని మాయావతి వెల్లడించారు.
Read Also: Mantralayam: భక్తులతో కిక్కిరిసిన మంత్రాలయం.. తప్పని ఇక్కట్లు
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
అయితే, అగ్రవర్ణాల ఓట్లు బీఎస్పీకి పడవు అని మాయావతి పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేసి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిందన్నారు. బీఎస్పీ ఎవరికీ ఉచితంగా మద్దతివ్వదు.. ఎన్నికల తర్వాత పొత్తు గురించి ఆలోచించవచ్చని ఆమె అన్నారు. దేశంలో త్వరలో ప్రకటించబోయే లోక్సభ ఎన్నికల్లో దళితులు, గిరిజనులు, అత్యంత వెనుకబడిన ముస్లింలు, మైనారిటీలకు మద్దతుగా మా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. నేటి ప్రభుత్వాలు పేర్లు మార్చడం, వాస్తవంతో సంబంధం లేని ప్రకటనలు చేయడంలో బీజీగా ఉన్నాయని మాయావతి అన్నారు.
Read Also: OTT Movies Telugu: సినీ ప్రియులకు పండగే పండగ.. ఈ వారం ఏకంగా 45 సినిమాలు రిలీజ్..
కానీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కులవాద ఆలోచనలను కలిగి ఉన్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. తన పేరు చెప్పకుండానే బీజేపీని ఉద్దేశించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతం, సంస్కృతి మంటల్లో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించింది. ఇది ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు.. యూపీలో బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల కోసం పని చేశామని తెలిపింది. ఇందులో మైనారిటీలు, పేదలు, దళితులు, రైతులతో పాటు ఇతర శ్రామిక ప్రజల కోసం ప్రజా సంక్షేమ పథకాలను ప్రారంభించామని పేర్కొనింది. రాబోయే తరం కోసం దళితులు, మైనార్టీలు, పేదలు, రైతులతో పాటు ఇతర వర్గాల ప్రజలు అంబేద్కర్ మార్గంలో నడుస్తున్న బీఎస్పీ పార్టీని బలోపేతం చేయాలని మాయావతి పిలుపునిచ్చారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కోసం ఆహ్వానంపై మాయావతి మాట్లాడుతూ.. నాకు ఆహ్వానం అందింది.. నేను పార్టీ పనిలో బిజీగా ఉన్నందున అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకోలేదు.. అయితే, ఏ కార్యక్రమం నిర్వహించినా మాకు అభ్యంతరం లేదు అని ఆమె చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!