Minister Seethakka: విద్యార్థులే ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత
- విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
- విద్యార్థులే మా ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత
- వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: విద్యార్థులే మా ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కరించేలా అంతా కృషి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, గురుకుల సంస్థల్లో, విద్యాబోధన మౌలిక వసతులు, భోజన వసతి, తదితర అంశాలపై మంత్రి సీతక్క సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, గురుకుల కార్యదర్శి సీతా లక్ష్మి, ఐటిడిఏ పీవోలు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, విద్యాసంస్థల హెడ్ మాస్టర్లు, వార్డెన్స్, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. పదేళ్లుగా పెండింగ్లో ఉన్న టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామని.. ఇంకా బోధన, ఇతర సిబ్బంది సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాలంలో టీచర్లు, వార్డెన్లు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.
Read Also: Congress: కాంగ్రెస్ గూటికి భారత రెజ్లర్లు.. కాసేపట్లో హస్తం పార్టీలో చేరనున్న వినేష్ ఫోగట్, పునియా
Also Read
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
- Virat Kohli: "ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను".. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
విద్యార్థులు హాస్టల్ విడిచి వాగుల వద్దకు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా చూడాలన్నారు. విద్యార్థులు జ్వరబారిన పడితే ఇంటికి పంపకుండా మనమే మెరుగైన వైద్యం అందించాలన్నారు. హాస్టల్ విద్యార్థులను సొంత పిల్లలుగా చూసుకోవాలని.. అప్పుడే మీ పిల్లలను దేవుడు మంచిగా చూస్తాడన్నారు. హాస్టల్స్ అంటే సొంత ఇంటిలా విద్యార్థులు ఫీల్ అవ్వాలన్నారు. నాణ్యమైన వేడి భోజనాన్ని అందించాలని.. వేడి చేసి చల్లార్చిన తాగు నీటిని ఇవ్వాలని ఆదేశించారు. తప్పకుండా మెనూ ఫాలో కావాలన్నారు. సరుకుల సరఫరా సరిగా లేకపోతే టెండర్లు రద్దు చేస్తామన్నారు. చిన్న చిన్న సమస్యలను బూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బ తీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లు, వార్డెన్లు, సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవరించాలన్నారు. మానవత్వాన్ని జోడించి మంచి విద్యను, నాణ్యమైన సేవలను అందించాలన్నారు. మీ కృషే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని మంత్రి పేర్కొన్నారు. ఎస్టీ సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉందని.. ఎస్టీ విద్యార్థుల సంక్షేమం పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులను చెల్లిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..