WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ ఆ జట్ల మధ్యే.. టీమిండియా మాజీ క్రికెటర్ జోస్యం
- WTC 2023-25 టైటిల్ మ్యాచ్లో ఇండియా-ఆస్ట్రేలియా మరోసారి ఢీకొంటాయి- దినేష్ కార్తీక్
- భారత్కు తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది ఒక అవకాశం- డీకే
- జూన్ 11-15 మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మూడో ఎడిషన్ టైటిల్ మ్యాచ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో పాయింట్ల పట్టికలో ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఇంగ్లండ్-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ జరుగుతుండగా.. తాజాగా బంగ్లాదేశ్ పాకిస్థాన్ను ఓడించి టాప్-5లో చోటు దక్కించుకుంది. ఈ క్రమంలో.. టాప్-2లో చోటు దక్కించుకోవాలని ప్రతి జట్టు ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి డబ్ల్యూటీసీలో ఏ రెండు జట్లు ఫైనల్ ఆడతాయో క్రికెట్ పండితుల అంచనా ప్రక్రియ మొదలైంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మూడో ఎడిషన్ టైటిల్ మ్యాచ్ ఈసారి జూన్ 11-15 మధ్య లార్డ్స్ మైదానంలో జరగనుంది. దీనిని ‘మక్కా ఆఫ్ క్రికెట్’ అని పిలుస్తారు. టైటిల్ మ్యాచ్కి జూన్ 16 రిజర్వ్ డే ఉంది. ఈ క్రమంలో.. టీమిండియా మాజీ క్రికెటర్ ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడగల టీమ్లు ఏంటో చెప్పాడు.
Read Also: Delhi: కాంగ్రెస్లో చేరిన భారత రెజర్లు వినేష్ ఫోగట్, పునియా.. హర్యానా నుంచి బరిలోకి..!
Also Read
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
WTC 2023-25 టైటిల్ మ్యాచ్లో ఇండియా, ఆస్ట్రేలియా మరోసారి ఢీకొంటాయని దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటి వరకు టీమిండియా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడింది. అయితే.. రెండు సార్లు టీమిండియా ట్రోఫీని అందుకోలేకపోయింది. మొదటి డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ను న్యూజిలాండ్ ఓడించగా.. రెండోసారి కంగారూల చేతిలో పరాజయం పాలైంది.
Read Also: Shivraj Singh Chauhan: రైతులకి సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేసినట్లే..
క్రిక్బజ్లో అప్లోడ్ చేసిన వీడియోలో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. “ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరుకుంటుందని నేను భావిస్తున్నాను. భారత్కు తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది ఒక అవకాశం. రెండేళ్ల క్రితం వారు ఓవల్లో మమ్మల్ని ఓడించారు. ఈ అవకాశం 2025లో రాబోతుంది. ఇది మళ్లీ రాబోతోంది. భారత్ ఆ అడ్డంకిని దాటాలని.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించాలని నేను నిజంగా కోరుకుంటున్నాను.” అని దినేష్ కార్తీక్ చెప్పాడు. ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే భారత్ 68.52 శాతం పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 62.50 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య మరోసారి ఫైనల్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!