NTV Telugu Site icon

Mark Antony : ఓటీటీ లోకి రాబోతున్న మార్క్ ఆంటోనీ.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే…?

Whatsapp Image 2023 10 09 At 11.50.46 Am

Whatsapp Image 2023 10 09 At 11.50.46 Am

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ మూవీ..సెప్టెంబర్ 15 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజైన ఈ మూవీ కోలీవుడ్‌ లో పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నది. వంద కోట్ల వసూళ్లను రాబట్టి విశాల్ కెరీర్‌ లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. తెలుగు లో మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో మార్క్‌, ఆంటోనీ గా రెండు పాత్రల్లో విశాల్ కనిపించి మెప్పించాడు.. అతడి నటన తో పాటు లుక్స్ విషయంలో విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.టైమ్ ట్రావెల్ కాన్సెస్ట్‌ తో రూపొందిన ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్‌తో పాటు ఎస్‌జే సూర్య, సునీల్‌, రీతూ వర్మ మరియు అభినయ ముఖ్య పాత్రలు పోషించారు.అయితే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడన్నది క్లారిటీ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అక్టోబర్ 13 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే..మార్క్ (విశాల్‌) తండ్రి ఆంటోనీ ఓ గ్యాంగ్‌స్టర్‌. ఓ గొడవల్లో అతను చనిపోతాడు. తండ్రి కారణంగా మార్క్ ఎన్నో ఇబ్బందులు పడుతోంటాడు. తండ్రిపై ద్వేషంతో రగిలిపోయే అతడికి ఓ టైమ్ ట్రావెల్‌ ఫోన్ ద్వారా గతంలోకి వెళ్లి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వస్తుంది.. అయితే ఆ తర్వాత ఏమైంది.. తన తండ్రిని మార్క్ కలుసుకున్నాడా..తండ్రి విషయంలో తాను చేసిన తప్పును మార్క్ ఎలా సరిదిద్దుకున్నాడన్నదే ఈ సినిమా కథ. 1975 మరియు 1995 బ్యాక్‌డ్రాప్‌లలో ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్‌. తెలుగు మరియు తమిళంలో రిలీజైన ఈ మూవీ హిందీలో మాత్రం సెన్సార్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొనింది.. మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ సెన్సార్ కోసం ఆరున్నర లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఇటీవల విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.