Margani Bharat: చంద్రబాబు శ్రీవారి లడ్డూపై పెద్ద నింద వేశారు..
- వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారు
- ఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పూజలు చేశారు
- వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు
Margani Bharat: గత వారం రోజులుగా తిరుపతి లడ్డూపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. తిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి బట్టబయలు చేశారన్నారు. వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారన్నారు. ఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పూజలు చేశారన్నారు. జూన్ 12 నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి సప్లై చేసిందన్నారు. జులై నెలలో వచ్చిన ట్యాంకులు వెనక్కి పంపించేశామని ఈవో శ్యామల రావు చెబుతున్నారన్నారు. ఎన్డీడీబీకి పంపించిన శ్యాంపుల్స్ రిపోర్ట్ జులై 23న వచ్చిందన్నారు. వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఈవోనే స్వయంగా చెప్పారని.. జంతువుల కొవ్వు కలిసిందని తెలిసినప్పుడు సెప్టెంబర్ 2 వరకూ చంద్రబాబు ఎందుకు ఆగారన్నారు.
Read Also: Posani Krishna Murali: కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలి?
Also Read
చంద్రబాబు రెండు నెలలు ఆగి అబద్ధాలు చెప్పారని.. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అంటూ మార్గాని భరత్ విమర్శించారు. నాలుగు ట్యాంకులు వెనక్కి పంపించామని ఈవో చెబుతున్నారని తెలిపారు. 2014-19 మధ్య 14 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారన్నారు. 2019-24 మధ్య 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారన్నారు. చంద్రబాబుకు హిందుత్వం పట్ల.. హిందువుల పట్ల అసలు గౌరవం ఉందా అని ప్రశ్నించారు. బూట్లు వేసుకుని శంకుస్థాపనలు చేశాడు…అదేనా హిందుత్వమంటే అంటూ వ్యాఖ్యానించారు. వెయ్యి కాళ్ల మండపాన్ని చంద్రబాబు ఎందుకు కూల్చివేయించేశారని ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయాలను బీజేపీ నేతలు గమనించాలన్నారు. సీఎం హోదాలో జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించారని.. పాదయాత్ర పూర్తయ్యాక కాలినడకన వెళ్లి తిరుమల దర్శనం చేసుకున్నారని ఆయన తెలిపారు. డిక్లరేషన్పై అప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదన్నారు.
Read Also: Bhupathi Raju Srinivasa Varma: లడ్డూ వివాదంపై కేంద్రం సీరియస్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
నెయ్యి నాణ్యత పై చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారా… తెలియక మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. NDDB నుంచి వచ్చిన నివేదిక….టీడీపీ కార్యాలయం నుంచి ఎందుకు విడుదల చేశారన.. NDDB నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పర్మిషన్ లేదని.. మా పార్టీ నేతలకు నోటీసులిచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే సిట్ అధికారులు అమలు చేస్తారని ఆరోపించారు. ప్రజల మనసులో చంద్రబాబు విషం నింపాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాయశ్ఛిత్త దీక్ష ఎందుకు చేస్తారో పవన్కు తెలుసా అన్న ఆయన.. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే పవన్ దీక్ష చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు ముందు చంద్రబాబుని ప్రశ్నించాలని మార్గాని భరత్ అన్నారు.
తాజావార్తలు
-
Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ – శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్
-
Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
-
Tollywood: తెలుగు సినిమాపై డీజిల్ దెబ్బ.. షూటింగ్లు రద్దు!
-
Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
-
Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!