Maoist Narayana: లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ.. ఏపీ నక్సల్స్ ఫ్రీ స్టేట్!
- ఏపీ డీజీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టులు
- దళంతో కలిసి లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ
- ఏపీ ఇప్పుడు నక్సల్స్ ఫ్రీ స్టేట్ అయ్యింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణ రావు అలియాస్ సోమన్న ఏపీ డీజీపీ ముందు లొంగిపోయారు. దాదాపు 36 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన నారాయణ సహా మొత్తం 9 మంది సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ, డివిజనల్, ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టుల లొంగుబాటుపై ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వివరాలు వెల్లడించారు.
ఏపీ డీజీపీ మాట్లాడుతూ… ‘ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు కార్యకలాపాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏపీ ఇప్పుడు నక్సల్స్ ఫ్రీ స్టేట్. అందరి కృషితో ఇది సాధ్యమైంది. కాల్పులు కూడా జరిగాయి, లొంగుబాట్లు కూడా జరిగాయి. మా పిలుపుకు స్పందించి 9 మంది లొంగిపోయారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సదుపాయాలు అందిస్తాము. చెన్నూరు నారాయణకు ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. మిగతా వారికి 24.20 లక్షలు అందిస్తున్నాం’ అని చెప్పారు. మావోయిస్టు అగ్రనేత గణపతి కార్యకలాపాలు కూడా రాష్ట్రంలో లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి, భద్రతలు మరింత బలపడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
లొంగిపోయిన మావోయిస్టులు:
1.చెన్నూరు నారాయణ, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు
2.కర్తం లచ్చు, కంపెనీ పార్టీ కమాండర్
3.పోడియం రాజే, ఏరియా కమిటీ సభ్యురాలు
4.కర్తం ఆడమే, ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు
5.ముచిక మాస, ఏరియా కమిటీ మెంబర్
6.మాదవి జోగి, ప్లటూన్ పార్టీ కమిటీ మెంబర్
7.ముచిక లక్ష్మణ్, పార్టీ కమిటీ మెంబర్
8.మడవ ఆడమ, పార్టీ కమిటీ మెంబర్
9.కడితి హుర్రే, గచిరోలి పార్టీ మెంబర్
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!