మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెన్నూరు నారాయణ రావు అలియాస్ సోమన్న ఏపీ పోలీసుల ఎదుట ఈరోజు లొంగిపోయారు. నారాయణతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ, డివిజినల్, ఏరియా కమిటీలకు చెందిన మరో 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ డంప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టు నారాయణ మాట్లాడుతూ.. గతంలో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని చెప్పారు. దేశంలో మావోయిస్టు…
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణ రావు అలియాస్ సోమన్న ఏపీ డీజీపీ ముందు లొంగిపోయారు. దాదాపు 36 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన నారాయణ సహా మొత్తం 9 మంది సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ, డివిజనల్, ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టుల లొంగుబాటుపై ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వివరాలు వెల్లడించారు. ఏపీ డీజీపీ మాట్లాడుతూ……