Maoist : మావోయిస్టు కమాండర్ వంజెం కేషా లొంగుబాటు.. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు భారీ దెబ్బ
- మావోయిస్టు కమాండర్ వంజెం కేషా లొంగుబాటు
- ఎన్కౌంటర్ల ప్రభావం – మావోయిస్టుల్లో లొంగుబాటుకు ఆసక్తి
- తెలంగాణలో మావోయిస్టుల చరిత్ర ముగిసే దిశగా..?
Maoist : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠిన నిర్భందాలతో పాటు వరుస ఎన్కౌంటర్ల కారణంగా మావోయిస్టు శక్తి క్రమంగా క్షీణిస్తోంది. అనేక మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మరణిస్తుండగా, మరికొందరు లొంగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, మావోయిస్టు పార్టీ గొత్తికొయ ఏరియా కమిటీ సభ్యురాలు, ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయింది.
వంజెం కేషా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామెడ్ మండలం, రాసపల్లి గ్రామానికి చెందినది. చిన్నతనం నుంచే చైతన్య నాట్య మండలిలో పని చేసిన ఆమె, మావోయిస్టు పార్టీలోని సభ్యులతో పరిచయం పెంచుకుంది. 2017లో పామెడ్ లోకల్ స్క్వాడ్ కమాండర్ గొట్టే కమల ద్వారా మావోయిస్టు పార్టీలో చేరింది. 2019లో కేషా అబుజ్మడ్ ప్రాంతానికి బదిలీ అయ్యింది. అక్కడ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి (కొసా)కు ప్రోటెక్షన్ గ్రూప్ సభ్యురాలిగా నియమితమైంది. 2021లో మావోయిస్టు కేంద్ర నాయకత్వం ఆమెను ఏరియా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి కల్పించింది. 2022 డిసెంబర్ వరకు ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్గా పని చేసింది.
Also Read
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
Donald Trump: ‘‘గవర్నర్ ట్రూడో’’.. కెనడా ప్రధానిపై ట్రంప్ ఫైర్..
ఈ కాలంలో మరో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు రమేష్ (ప్రస్తుతం మహారాష్ట్ర జైలులో ఉన్నాడు)ను వివాహం చేసుకుంది. ఉత్తర బస్తర్ డివిజన్లో కొంతకాలం సేవలందించిన అనంతరం, 2024 ఏప్రిల్లో మళ్లీ కొసా ప్రోటెక్షన్ గ్రూప్ మహిళా కమాండర్ బాధ్యతలు చేపట్టింది.
వంజెం కేషాపై ప్రభుత్వ ప్రతిష్టగొన్న ₹4 లక్షల రివార్డు ఉంది. పోలీసుల ఎదుట లొంగడానికి పలు కారణాలు ఉన్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. కఠినంగా మారిన పోలీసులు దాడులు: వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టుల సంఖ్య తగ్గుతోంది. మావోయిస్టుల తీరుపై స్థానిక ప్రజల ఆగ్రహం పెరిగింది. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది. తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస పథకాలు అందిస్తోంది.
కేషా మావోయిస్టు కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించింది. కొహిలబేడా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పాల్గొంది, ఈ దాడిలో ఒక పోలీస్ అధికారి మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అబుజ్మడ్ ప్రాంతంలో పోలీసులు–మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మరో అధికారి మరణించాడు.
వంజెం కేషా లొంగుబాటు నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ పోలీస్ శాఖ ఇచ్చిన హామీలు, ప్రభుత్వ పునరావాస పథకాలు కీలకంగా మారాయి. లొంగుబాటు చేసిన వారిని సమాజంలో తిరిగి స్థిరపడేందుకు అన్ని విధాలుగా ఆదుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ లొంగుబాటుతో మావోయిస్టు ఉద్యమానికి మరోసారి దెబ్బ తగిలినట్టైంది.
Maharashtra: మహాయుతిలో ముసలం.. ప్రభుత్వ కార్యక్రమాలకు షిండే దూరం!
తాజావార్తలు
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో