Daggubati Purandeswari: బీజేపీలో చేరిన పలువురు వైసీపీ నేతలు.. ఎన్డీఏ కూటమితోనే ప్రగతి సాధ్యం..
- బీజేపీలో చేరిన రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు..
- పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన పురంధేశ్వరి..
- దేశ ప్రగతి NDA కూటమితోనే సాధ్యం..
- మూడోసారి ప్రజలు అవకాశం ఇవ్వడానికి కారణం మోడీ చేసిన సంక్షేమమే..
Daggubati Purandeswari: బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో పలువరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. అనతరపురం, రాజంపేట, సత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ గూటికి చేరారు.. వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పదేళ్లుగా దేశ ప్రజల కోసం పని చేస్తోంది.. దేశ ప్రగతి NDA కూటమితోనే సాధ్యం అన్నారు.. మూడోసారి ప్రజలు అవకాశం ఇవ్వడానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సంక్షేమమే అన్నారు.. రాష్ట్రంలో గత ఐదేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులు పోవాలనే కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు.. చంద్రబాబు ప్రజాహిత పాలనను రాష్ట్రంలో అందిస్తారని వెల్లడించారు పురంధేశ్వరి..
Read Also: CM Chandrababu: భారీ వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
మరోవైపు, రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతం అవుతోంది గనుక కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు పురంధేశ్వరి.. అధికారులు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఐదేళ్ల వైసిపి అరాచక పాలనని ప్రజలు చూశారు.. 16 సంవత్సరాల బీసీ అమ్మాయి ఆమె అక్క మీద దౌర్జన్యం చేస్తున్నారని అడిగితే ఆమెను కిరాతకంగా చంపారు.. దీనిపై స్పందించలేదు… ఉత్తరాంధ్రలో డాక్టర్ ఆక్సిజన్ కొరత ఉందని కరోనా సమయంలో ప్రశ్నిస్తే తీవ్ర ఇబ్బందులు పెట్టారు.. లోకల్ బాడీ ఎన్నికల్లో నామినేషన్ వేయటానికి వెళ్ళిన అభ్యర్థుల చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు చింపేశారు.. నెల్లూరులో కత్తులతో ఓ మహిళ కార్యకర్తని గాయపరిచారు. లేఖ రాయడం కాదు గుండెలపై చేయి వేసుకొని వైఎస్ జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
Read Also: Yogi Adityanath: కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్లకు నేమ్బోర్డులు ఉండాల్సిందే..
ఇక, కేంద్ర ప్రభుత్వ సహాయం లేనిదే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం కాదు అన్నారు పురంధేశ్వరి.. మెడ్ టెక్ పార్క్ నిర్మాణంలో జితేంద్ర సింగ్ స్వయంగా జగన్ నుండి సహకారం లేదని చెప్పారు.. నితిన్ గడ్కరీ సహకారంతోనే చేశామని స్వయంగా చెప్పారు.. బీజేపీ సింహ భాగస్వామ్యం లేనిది రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని స్పష్టం చేశారు.. గతంలో వైఎస్ జగన్ సర్కార్కు కేంద్ర ప్రభుత్వ సహకార నిరాకరణపై పేర్ని నాని విఫులంగా చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి..
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!