Mansion 24 : ఓంకార్ మాన్షన్ హౌస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్…
రాజుగారి గది సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన యాంకర్ ఓంకార్ ఫస్ట్ టైమ్ మాన్షన్ 24 పేరుతో ఓ వెబ్సిరీస్ను తెరకెక్కించాడు.హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 17న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ వెబ్సిరీస్ విడుదల కానుంది.ఈ సిరీస్లో సత్యరాజ్, వరలక్ష్మి శరత్కుమార్, అవికా గోర్, బిందుమాధవి, నందు మరియు మానస్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మొత్తం ఆరు ఎపిసోడ్స్తో థ్రిల్లింగ్గా ఈ సిరీస్ సాగనున్నట్లు తెలుస్తుంది.బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస వెబ్సిరీస్లోనే నటిస్తోంది నటి బిందుమాధవి. మాన్షన్ 24లో ఆమె పాత్ర ఎంతో డిఫరెంట్గా ఉండబోతున్నట్లు సమాచారం.మరోవైపు అవికాగోర్ మొదటి సారి వెబ్ సీరీస్ లో నటిస్తుంది.బాహుబలి లో కట్టప్ప పాత్ర ద్వారా ఎంతో ఫేమస్ అయిన సత్యరాజ్ నటిస్తోన్న ఫస్ట్ తెలుగు వెబ్సిరీస్ కూడా మాన్షన్ 24 కావడం విశేషం.ఇందులో సత్యరాజ్, వరలక్ష్మి శరత్కుమార్ తండ్రీకూతుళ్లుగా కనిపించబోతున్నారు.
ఓ పాడుబడ్డ మాన్షన్లోకి వెళ్లిన కాళిదాస్(సత్యరాజ్) కనిపించకుండాపోతాడు.ఆ మాన్షన్లోకి వెళ్లిన ఎవరూ కూడా తిరిగిరారు. తండ్రి కోసం కొంతమంది మిత్రులతో కలిసి ఆ మాన్షన్లోకి అడుగుపెడుతుంది కాళిదాసు కూతురు. అక్కడ ఆమెకు ఎలాంటి భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయన్నదే ఈ వెబ్సిరీస్ కథ..యాంకర్ గా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ దర్శకుడు గా మాత్రం ఆ స్థాయిలో రానించ లేకపోతున్నాడు.జీనియస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఓంకార్ ఆ తరువాత రాజు గారి గది సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.ఆ అ తరువాత రాజుగారి గది 2 కూడా మంచి విజయం అందుకుంది. కానీ ఆ తరువాత వచ్చిన రాజు గారి గది 3 నిరాశ పరిచింది.రాజుగారి గది -3 తర్వాత డైరెక్షన్ కు బ్రేక్ తీసుకున్న ఓంకార్ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ సిరీస్తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!